ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై నీలినీడలు కమ్మకుంటున్నాయి. కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్ జ్యోతి విషయంలో అమె చేసిన వ్యాఖ్యాల వెనుక నిగూఢ అర్థాన్ని దాచి అమెను క్షమించమని ప్రతిపక్షాలను వేడుకుంటున్నారు. దేశంలో మార్పలు తీసుకువస్తానంటూ చెప్పిన మోడీ.. తప్పులు చేసిన తన వారిని వెనకేసుకురావడం దేశవ్యాప్త చర్చలు ఆస్కారం కల్పిస్తోంది. అన్ని రంగాల్లో ప్రధాని మోడీతో మార్పలు సాథ్యమని విశ్వసిస్తున్న దేశ ప్రజలు.. రాజకీయాల్లో సమూల మార్పలు తీసుకురావడం మోడీ తో కూడా సాధ్యం కాదనే స్థాయికి ఈ ఘటన అద్దం పడుతోంది.
మహిళా కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యాలపై ముందుగా హెచ్చరించి.. ఇకపై జాగ్రత్తా వ్యవహరించాలని సూచించింది ప్రధాని అనే చెప్పడంతో సందేహమే లేదు. కాని కేంద్ర మంత్రి హోదాలో నోరు జారినీ.. తప్పలు చేసినా వారిని తన క్యాబినెట్ లో ఎలా కొనసాగనిస్తారన్నదే ప్రశ్న. బీజేపి సీనియర్లను పక్కకు జరిపి కేవలం తనకు నచ్చిన, వారిని, తాను మెచ్చిన వారిని మాత్రమే క్యాబినట్ లోకి తీసుకున్న మోడీ.. వారిని అండదండగా నిలిస్తే తప్పులేదు కానీ.. వారి తప్పులను కూడా పెద్ద మనస్సుతో వదిలేయాని ప్రతిపక్షాలను కోరడమే అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
ఈ ఘటనతో ప్రధాని తన వర్గానికి చెందిన వారిని వెనకేసుకొస్తున్నారని దేశ ప్రజలకు అర్థమైంది. ప్రతిపక్ష నేతలు సహృదయంతో కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యాలను మన్నించి.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్యాలని చెప్పడం ఎంత వరకు సమజసం. ఇంత అసభ్య పదజాలాన్ని వాడిన మంత్రిని తన క్యాబినెట్ లో ఎలా కొనసాగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు చిన్న తప్పలు చేసినా ఎత్తిచూపిన మోడీ.. తన వరకు వచ్చే సరికి వదిలేయమని నిలదీస్తున్నాయి. ప్రధాని హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలను ఎందుకు పెద్ద మనసు చేసుకుని వదిలేయలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభల్లో నాలుగు రోజులగా వివాదం రాజుకుంటూనే వుంది. రామరాజ్యం వైపు నిలుస్తారా.. లేక అక్రమార్కుల పక్షాన నిలబడతారా అన్నది ప్రజలే తేల్చుకోవాలని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యాలు నాలుగు రోజులుగా అగ్గిని రాజేస్తున్నాయి. ప్రజలు అధిక సంఖ్యలో కనబడే సరికి తన్మయత్వంలో మాట్లాడిన కేంద్రమంత్రి తరువాత నోరు కరుచుకున్నారు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ఉభయ సభల్లో క్షమాపణలు చెప్పారు.
ఈ విషయమై శుక్రవారం మరోమారు స్పందంచిన ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభను సజావుగా నడిపించడంలో సహకరించిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్షాల ఎంపీలు తమ ఆందోళనలు ఆపేలా లోక్సభలోని ఆయా పార్టీల ప్రతినిధులు నచ్చజెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు కార్యక్రమాల ప్రారంభంలో ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. మంత్రి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు తప్పే అనడంతో తమకు ఎలాంటి సందేహం లేదన్న మోదీ తమ పార్టీ ఎంపీల సమావేశంలో తీవ్రంగా మందించినట్లు తెలిపారు. సవ్యమైన భాష వాడాలనీ, అపశబద్దాలు ప్రయోగించవద్దనీ ఆదేశించానని, జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి సాథ్వీ లోక్ సభకు కొత్తవారు, గ్రామీణ ప్రాంతం నుంచి మొదటి సారి వచ్చిన మహిళ తెలియక చేసిన తప్పును పెద్దమనసు చేసుకుని క్షమించాలన్నారు.. కొత్త మంత్రి క్షమాపణలు చెప్పినందున ఈ సభలోని సీనియర్ నేతలు రాజ్యసభలోని తమ పార్టీల ఎంపీలకు నచ్చజెప్పాలని కోరారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టి సభా కార్యక్రమాలు జరగనివ్వాలని పెద్ద సభలోని తమ పార్టీల నాయకులకు చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాలు మాత్రం బెట్టు వీడడం లేదు. అమె కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాని మోడీ వివరణతో సరిపుచ్చుకోని విపక్షాలు కేంద్ర మంత్రి సాధ్వి వ్యాఖ్యలను నిరసగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విపక్ష నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంటు ప్రారంభానికి ముందు మూతులకు నల్లగుడ్డలకు కట్టుకుని ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి సాధ్విని తక్షణమే పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రకటించడం ఇదే మొదటి సారి. మంత్రి వ్యాఖ్యలపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మొదట రాజ్యసభలో ఎందుకు ప్రకటన చేశారని విపక్ష ఎంపీలు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే మాట్లాడుతూ.. తాము ఎ ఒక్కరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించడం లేదని చెప్పారు. అయితే ఈ తప్పు జరగడానికి అసులు కారణమేంటన్నదానిపై తాము వివరణ కోరుతున్నామన్నారు. తాము ఎవరి వ్యక్తిగత నేపథ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించడంలేదని చెప్పారు. ఈ మద్య కాలంలో వరుసగా బీజేపి నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను ఎందుకు చేస్తున్నారని తాము అడగదలుచుకున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులు, బీజేపి నేతలు వివాదాస్పత వ్యాఖ్యాలు సమాజ సంఘటితానికి సవాల్ గా పరిణమిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more