పేదల పార్టీగా చెప్పుకునే అరవింద్ కేజ్రివాల్ భారీ ఖర్చుతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్లేటు భోజనం ఖరీదు కేవలం రూ. 20వేలేనట. అవాక్కయ్యారా.., సెవెన్ స్టార్ హోటల్ లో ఒక రోజంతా ఉండి భోజనం చేసినా ఇంత ఖర్చు అవ్వదు కదా అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎన్నికల ఖర్చుల కోసం అయ్యే నిధుల సమీకరణలో భాగంగా పార్టీ విందు నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ విందుకు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర విభాగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది.
నేరుగా డబ్బులు తీసుకోలేక ఇలా విందు భోజనం పెట్టిన పార్టీ.., ఒక్కో ప్లేటు ధర రూ. 20వేలుగా నిర్ణయించింది. ప్లేటు మీల్స్ ధర కాస్త ఎక్కువే అయినా పార్టీ ఫండ్ కావటంతో.., తప్పదన్నట్లుగా చెల్లించి భోంచేశారు. ఇలా విందు పేరిట మొత్తం రూ.91లక్షలు వసూలు చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ మొత్తంలో 36లక్షల రూపాయలు నగదు కాగా.., రూ. 36 లక్షల రూపాయలు చెక్కులు ఉన్నాయి. మిగతా నగదు వాలంటీర్ల ద్వారా వసూలయినట్లు తెలుస్తోంది. ప్లేటుకు రూ.20వేలు బాగా గిట్టుబాటు కావటంతో మిగతా ప్రాంతాల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
త్వరలో బెంగళూరులో విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారట. ఆర్థిక రాజధాని లో రూ. 20వేలు ధర నిర్ణయించారు. తర్వాతి టార్గెట్ ఐటీ హబ్ కావటంతో వారిని టార్గెట్ చేసి ఎంత ధర నిర్ణయిస్తారో తెలియాల్సి ఉంది. గతంలో జరిగిన ఎన్నికలకు కూడా విరాళాలు సేకరించారు. టార్గెట్ రీచ్ కాగానే ఇక ఎవరూ డబ్బులు పంపవద్దు అని ప్రకటించారు కూడా. అయితే భోజనాలు పెట్టి వేల రూపాయలు వసూలు చేయటంపై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more