తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలో అగ్రగామిలా ఉండేలా పారిశ్రామిక విధానం అమలు చేస్తామన్నారు. రాష్ట్ర శాసనసభలో కొత్త పారిశ్రామిక విధానం బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... గ్రానైట్ ఉత్పత్తుల రవాణాలో నిబంధనలు సరళీకరిస్తామన్నారు. బిల్లును సభ్యులంతా ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామన్నారు.
అలాగే హైదరాబాద్ - వరంగల్ కారిడార్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ జౌళి నిలయంగా వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామిక పార్కులు, వ్యాట్ హేతుబద్ధీకరణ, పారిశ్రామిక కార్మికుల రక్షణ మొదలైన అంశాలపై శ్రద్ధ పెడతామని చెప్పారు. విద్యుత్, నీటి సదుపాయాలను కూడా మెరుగు పరుస్తామని సభలో కేసీఆర్ చెప్పారు. కాగా భూ కేటాయింపుల ఆంశంపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. సొసైటీల ముసుగులో కొందరు పెద్దలు గద్దల్లా భూములను కబ్జా చేయటమే కాకుండా, దర్జాగా అమ్ముకున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శించారు. ఎన్ని విచారణ కమిటీలే వేసినా ఫలితం కానరాలేదన్నారు. సొసైటీలన్నింటిని రద్దుచేసి ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని అక్బరుద్దీన్ సూచించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సొసైటీ భూముల్లో అక్రమాలపై ఒకటి కాదు రెండు సభా సంఘాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ను కోరారు. సభాసంఘం ఏర్పాటుపై ప్రతిపక్షాలు మద్దతు పలికాయి
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more