పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజున నల్లధనం అంశంపై సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన వెంటనే నల్లధనంపై చర్చకు అనుమతించాలని విపక్షాలు పట్టుబట్టాయి. నల్లధనంపై చర్చకు సమయం కేటాయిస్తామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. వెల్లోకి దూసుకువచ్చిన సభ్యులు నల్లధనం అంశంపై మొదటగా చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని.. తృణమూల్ సభ్యులపై ఒకదశలో స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం వేశారు.
విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగానే తృణమూల్ సభ్యులు మరోమారు వెల్లోకి దూసుకొచ్చి నల్లధనాన్నివెనక్కి తెప్పించాలంటూ నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనింది . దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ వాయిదా పడటంతో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బయట నల్ల గోడుగులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకోస్తుందన్న నరేంద్రమోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమయ్యిందంటూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు.
వాయిదా అనంతరం లోక్సభ ప్రారంభమైన వెంటనే నల్లధనం అంశంపై చర్చించాలని కోరుతూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ... నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పదేళ్లలో నల్లధనంపై యూపీఏ ఏం చేయలేకపోయిందని, తాము వచ్చిన ఆరు నెలల్లోనే చర్యలు చేపట్టామని వెల్లడించారు. విపక్షాల ఆందోళన మధ్యే లోక్సభ కొనసాగుతోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more