ఈ మద్య టీవీ చానెల్ లో వచ్చే ప్రోగ్రాముల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అంటూ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తెరపై కన్పించే తారల పేర్లు చెప్తే భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వేల మంది మెసేజ్ లు పంపితే అందులో ఒక్కరికి ఈ వరం దక్కతుంది. మిగతా వారంతా బ్యాడ్ టైం అనుకుని సర్ది చెప్పుకుంటారు. అయితే ఓ షోలో బహుమతి గెలుచుకున్న ఒక వ్యక్తి.., బహుమతి పొందలేదు కదా డబ్బు పోగొట్టుకుని పోలిస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు.
పోలిసుల సమాచారం ప్రకారం.., అక్కయ్యపాలెంకు చెందిన నిర్దోశ్ కుమార్ అనే యువకుడు ఈనెల 22వ తేదిన ఓ టీవీ చానెల్ లో రాత్రి సమయంలో వచ్చే షోను చూశాడు. కార్యక్రమంలో భాగంగా అమితాబ్ బచ్చన్ సగం ముఖం ఉన్న ఫొటో చూపించి.. ఎవరో గుర్తించమని ఎస్.ఎం.ఎస్. కాంటెస్ట్ పెట్టారు.
స్పందిచిన నిర్దోశ్ కుమార్ మెసేజ్ చేయగా.. కొద్ది సమయం తర్వాత నిర్దోశ్ కు ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు రూ.12.50 లక్షల విలువైన కారు గెలుచుకున్నారు. మీకు డబ్బు కావాలలా లేక కారు కావాలా..? అని ప్రశ్నించగా డబ్బు కావాలని యువకుడు సమాధానం ఇచ్చాడు.
బహుమతిని పంపాలంటే మీరు రూ.6300 చెల్లించాలని చెప్పటంతో ఆ మొత్తం వెంటనే డిపాజిట్ చేశారు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి రూ.12,600 చెల్లించాలని కోరితే ఆ మొత్తం కూడా కట్టేశాడు. ఇక మళ్ళీ గంటకు ఇంకోసారి ఫోన్ వచ్చింది. సర్ అదనపు పనులు ఏర్పడిన కారణంగా రూ.25వేలు అదనంగా చెల్లించాలి అని చెప్పాడు. ఇక నిర్దోశ్ కు విషయం అర్ధమయింది. తాను అడ్డంగా బుక్ అయ్యాను అని తెలుసుకుని పోలిసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత చానెల్ వారితో పాటు నంబర్ ను నడుపుతున్న థర్డ్ పార్టి సర్వీస్ పై కూడా కంప్లయింట్ నమోదు చేసిన పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more