ఇటీవలే వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన భారీచోరీ పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రధానద్వారానికి వేసిన తాళాలు వేసినట్టే వుండగా.. లాకర్లో వున్న నగలు, నగదు మొత్తం మాయం కావడంతో ఈ చోరీ వెనుక బ్యాంకు సిబ్బంది హస్తం ఖచ్చితంగా వుంటుందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు నేపథ్యంలో ఆ చోరీకి పాల్పడిన విషయాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో ఆ చోరీకి పాల్పడిన బ్యాంకు అటెండర్ రమేష్ ను సునాయాసంగా పట్టుకోగలిగారు. ఆ దొంగను డీఐజీ మల్లారెడ్డి మీడిమాముందు ప్రవేశపెట్టిన అనంతరం.. కేసును ఎలా చేధించారో వివరించారు.
బ్యాంకు ప్రధానద్వారానికి తాళాలు వేసినవి వేసినట్టే వుండగా.. లోపల నగదు, నగలు చోరీ అయిన నేపథ్యంలో ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం వుంటుందనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సిబ్బందిని పలుమార్లు పలురకాలుగా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. ఇలా ప్రశ్నోత్తరాల సందర్భంలోనే రమేష్ భార్యను కూడా ప్రశ్నించారు. అప్పుడు ఆమె ద్వారా పోలీసులకు చాలా విషయాలు బయటపడ్డాయి. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసును సునాయాసంగా ఛేధించగలిగామని వారు పేర్కొన్నారు. 34 కేజీల బంగారం, 21 లక్షల నగదును దొంగలించి కరీంనగర్ జిల్లాలోని అంబటిపల్లిలో బంధువుల ఇంట్లో దాచాడని పోలీసులు గుర్తించారు.
పోలీసులకు దొరకకుండా వుండేందుకు అతగాడు చోరీ సొత్తులోని 19 లక్షల రూపాయల తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాడు. అయితే దర్యాప్తులో భాగంగా అతడి భార్యను ప్రశ్నించగా ఆమె చాలా విషయాలు వెల్లడించిందని, ఆమె ఇచ్చిన సమాచారంతోనే చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఇలా ఈ విధంగా రమేష్ భార్య తన ‘దొంగ’ మొగుడ్ని పోలీసులకు అప్పగించింది. అయితే.. అటెండర్ అయిన రమేష్ చేతికి విలువైన స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా వెళ్లాయన్న విషయాన్ని ఆరా తీస్తున్నామన్నారు. అంటే.. రమేష్ వెనుక ఇంకొకరి హస్తం వుండొచ్చని వారి అనుమానం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more