బాలీవుడ్ వెండితెరపై తన అభినయంతో చెరగని ముద్రను వేసిన గత తరం హీరోయిన్ మమతా కులకర్ణిని కెన్యా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు అమె భర్త విక్కి గోస్వామిని కూడా కెన్యా పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. వీరు కెన్యాలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న అభియోగాలపై అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. కెన్యాలోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. 90ల కాలంలో బాలీవుడ్ హీరోయిన్గా వెలుగొందిన మమతా కులకర్ణి దాదాపు దశాబ్ద కాలం నుంచి మీడియాకు దూరంగా గడుపుతున్నారు. చిట్ట చివరి సారిగా దేవానంద్ తీసిన సెన్సార్ అనే సినిమాలో 2001లో ఆమె కనిపించారు.
దుబాయ్లో కొంతకాలం అజ్ఞాతంగా గడిపిన అనంతరం ఆమె నైరోబీకి వెళ్లిపోయారు. ఆమె స్నేహితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విజయ్ 'విక్కీ' గోస్వామితో కలిసి ఆమె దుబాయ్ వెళ్లినట్లు తొలుత కథనాలు వచ్చాయి. తర్వాత అతడిని పెళ్లిచేసుకుంది. విక్కీని పోలీసులు దుబాయ్లో 1997లో డ్రగ్స్ కేసులో అరెస్టుచేయగా, 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. అతడిని చూసేందుకు మమత కూడా జైలుకు వెళ్లారు. అప్పట్లో తెల్లబడిపోయిన జుట్టు, కళ్లజోడుతో దుబాయి జైలుకు వెళ్లినప్పుడు ఆమెను అక్కడి మీడియా గుర్తుపట్టి ఫొటోలు ప్రచురించింది. అయితే.. సత్ప్రవర్తన కారణంగా మమత భర్త విక్కీని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా నైరోబీలో డ్రగ్స్ కేసులో భార్యాభర్తలు ఇద్దరినీ అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more