ప్రపంచానికే సవాల్ గా మారిన ఉగ్రవాదులు తమ సత్తా చాటేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కత్తుల్లాంటి అనుచరులను తయారు చేసేందుకు భారీగా రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం, మతం పేరుతో జరిగే ప్రచారం పట్ల ఆకర్షితులయ్యే యువతతో పాటు కుటుంబ పరిస్థితులు, సమాజంపై కసి, కోపం ఉన్న వారిని టార్గెట్ చేసి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి తాజాగా అందిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఐ.రా.స. గుర్తించింది.
ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై నిఘా ఉంచగా..., వారు చేపడుతున్న నియామకాల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఏజంట్ల ద్వారా విదేశాల నుంచి నియామకాలు జరుపుతున్నారు. ఇక విస్తరించిన సోషల్ మీడియా కూడా ఉగ్రవాదులకు కలిసి వచ్చే అంశం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా.., ఉగ్రవాదులు యువతకు గాలం వేసి వారిని మతోన్మాదంలోకి లాగుతున్నారు. నేరుగా సంభాషణలు జరిపి సంస్థల్లోకి చేర్చుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ జరిపే రిక్రూట్ మెంట్ ఫ్రధానంగా రష్యా, ఫ్రాన్స్, యు.కే, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు భారత్ నుంచి కూడా నియామకాలు జరుపుతోంది.
వీరంతా నేరుగా వచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో..., వారితో కలిసి పనిచేయకపోవచ్చు. అయితే సొంత ప్రదేశాల్లో లేదా ఉగ్రవాద సంస్థలు చెప్పిన ప్రదేశాల్లో ఉంటూ వారికి సమాచార సేకరణ, దాడులకు వ్యూహాలు ఇతర పనులు చేసిపెడతాయి. ఇందుకోసం భారీ స్థాయిలో వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బుకు ఆకర్షితులయి ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారు కొందరు అయితే... మతం పట్ల అమితమైన ప్రేమ ఉన్న మరికొందర్ని టార్గెట్ చేసి వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరేవారికి వారి వ్యక్తిగత, సామాజిక పరిస్థితులు కూడా కారణం అవుతున్నాయని సర్వేలో తేలింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more