బండ్లు ఓడలవుతాయి... ఓడలు బండ్లవుతాయి అనే మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టికి సరిగ్గా సూట్ అవుతుంది. పది సంవత్సరాలు అధికారం అనుభవించిన పార్టీ.., ప్రస్తుతం కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేదు. అటు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా హర్యానాలో అధికారం కోల్పోగా.. మహారాష్ర్టలో ఒరిగిందేమి లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మోడీ హవా తగ్గిపోయింది అని అంతా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం తగ్గటం లేదు. ఇది అందరూ చెప్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో 128ఏళ్ళక్రితం ప్రస్థానం మొదలు పెట్టిన ఈ పార్టీ ప్రయాణం నడిసంద్రంలో నావలా మారింది. మరిప్పుడు ఎటు వెళ్తుంది...? ఏం చేస్తుంది?
స్వాతంత్ర్యానికి పూర్వం పుట్టిన కాంగ్రెస్ పార్టికి ఎంతో చరిత్ర ఉంది. దేశాన్ని, ప్రపంచాన్ని శాసించిన ఎంతోమంది నేతలు ఈ బడిలో ఓనమాలు నేర్చుకున్నవారే. భారత దేశానికి రాజకీయాలు నేర్పింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పొలిటికల్ దిగ్గజం ఇప్పుటు కర్రపట్టుకుని కూడా నడవలేకపోతోంది. కొండ నాలుకకు మందువేస్తే మందు నాలుకకు ముప్పు వచ్చినట్లు.. పార్టీ నాయకత్వంలో మార్పు కొత్త జవసత్వాలు ఇస్తుందనుకుంటే ఉన్న బలం కాస్తా తగ్గిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా అనేక అంశాలు కాంగ్రెస్ ను ఓడించటంలో ప్రభావం చూపాయి.
అందులో ప్రధానంగా మోడి మ్యానియా ఒక కారణం అయితే.. కాంగ్రెస్ సొంత తప్పిదాలు ఎక్కువగా ప్రభావం చూపాయి. అధికారంలో ఉండగా ఎన్నో స్కాములు జరిగాయి. గత ఐదేళ్ళలో ప్రతి పార్లమెంటు సమావేశం ఏదో ఒక స్కాముపై ఆందోళనతో అట్టుడికింది. దీంతో యూపీఏ అంటే స్కాముల ప్రభుత్వం అని ముద్రపడింది. దీనికి తోడు పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఇలా అనేక అంశాలు ప్రభుత్వాన్ని మసకబార్చాయి. ఇలా అన్ని కలిసి కాంగ్రెస్ నావను తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేశాయి. దీంతో కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని భావించే వారు ప్రత్యామ్నయంగా ఉన్న బీజేపికి వేస్తున్నారు అన్నమాట. అలా కమలం వికసించటానికి కాంగ్రెస్ తన చేతులతో నీరు పోస్తోందని స్పష్టం అవుతోంది.
ఓటమి గెలుపుకు దారి చూపుతుంది అంటారు... అంతేకాక ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి. కాబట్టి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి వారితో కలిసి, వారి మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తే పునర్వైభవం ఖాయం. అంతేకాని పార్టీ వార్ రూంలో కూర్చుని ఫలితాలపై పోస్టుమార్టం చేసి రాజకీయ విశ్లేషణలతో సమయం వృధా తప్ప మరొకటి ఉండదు. రాహుల్ సమీక్షలు, దిగ్విజయ్ పర్యటనలు ఫలితాలను మార్చలేవు, ప్రభుత్వంలోకి రానీయలేవు అని విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తి పూజ మానుకుని..., ప్రజలను పూజించి వారి సమస్యలపై పోరాటం చేస్తే పోయిన పేరు తిరిగి వస్తుంది. ప్రజలను నమ్ముకుని పనిచేసిన వారిని జనాలెప్పుడూ మోసం చేయరు. ఎందుకంటే వారు రాజకీయ నేతలు కాదు కాబట్టి. ఇది తెలుసుకుని నడుచుకుంటే మహర్ధశ పట్టవచ్చు లేకపోతే పార్టీని మర్చిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more