మన భారతదేశంలో అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఆ తరహాలోనే చెన్నైలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో వున్న విద్యార్థి అల్లరి చేస్తే.. అతనిని దండించే క్రమంలో కేవలం గిల్లిందని ఆ టీచర్ కు భారీ జరిమానే పడింది. సహజంగానే స్కూల్ లో విద్యార్థులు అల్లరి చేస్తే టీచర్లు దండించడం సహజం. కానీ ఇక్కడ కేవలం గిల్లిందని ఏకంగా జరిమానా విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఓ విద్యార్థి అల్లరి చేస్తే.. అతనిని దండించే క్రమంలో టీచర్ మెహరున్నీసా అతని బుగ్గ గిల్లింది. అంతే! ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి ఆగ్రహంతో జరిగిన ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. అప్పటినుంచి దీనిపై విచారణ జరిపిన కమిషన్.. 2013లో నిబంధనలు అతిక్రమించిందంటూ పాఠశాలకు రూ.1000 జరిమానా విధించింది. అదే సమయంలో విద్యార్థి తల్లి తమ బిడ్డ టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) కూడా ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ బాలుడికి టీసీ ఇవ్వడంలో ఆ పాఠశాల యాజమాన్యం జాప్యం చేసింది.
అయితే జరిగిన ఘటనలో తనకు సరైన న్యాయం జరగలేదన్న ఆవేదనతోపాటు స్కూలు యాజమాన్యం టీసీ ఇవ్వడంలో జాప్యం చేసిందని విద్యార్థి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కింది. అంతేకాదు.. సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. మరోవైపు తనను పలువిధాలుగా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసు కింది కోర్టులో పెండింగ్ లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. అయితే విద్యార్థి తల్లి చేసిన ఆరోపణలన్నింటిపైనా రూ.50000 జరిమానాగా చెల్లించాలని తెలిపింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more