Chandrababu antichrist only publicity critisices rajya sabha member chiranjeevi

Chiranjeevi, Ex Central minister, Congress MP, Chandrababu, Hudhud cyclone, chief minister, Antichrist, AP

Chandrababu Antichrist only publicity, critisices Rajya sabha member chiranjeevi

చంద్రబాబుకు పబ్లిసిటీ స్టంట్స్ చాలా బాగా తెలుసు..

Posted: 10/30/2014 07:12 PM IST
Chandrababu antichrist only publicity critisices rajya sabha member chiranjeevi

హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమైయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆరోపించారు. తుపాను వస్తుందని తెలిసిన సహాయక చర్యలు చేపట్టడంలో ఆయన, ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ నేపథ్యంలో 50 మంది చనిపోయారని తెలిపారు.

 అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ... తుపాను సమయంలో కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే  పాకులాడారని ఎద్దేవా చేశారు.  తుఫాను బాధితులకు అండగా నిలుస్తున్నట్లు.. అధికారులపై మండిపడుతున్నట్ల, తిరిగి ఆదే అధికారుల వద్దకు వచ్చి మన్నించమని కోరడం పబ్లిసిటీ స్టంట్స్ కాక మరేంటని ఆయన ప్రశ్నించారు. ఒడిశా రాష్ట్రంలో అనేక పెనుతుఫానులు వచ్చినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా మనం సహాయక చర్యలను అందించలేకపోయామని, అందుకే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందన్నారు.

రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఐదు నెలలుగా  రోజుకో మాట చెప్పి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. బ్లాక్మనీపై బీజేపీది ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. కేంద్రం దగ్గర చంద్రబాబుకు ఏ మాత్రం పలుకుబడి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. పచ్చని పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు భూ సేకరణ కోసం రైతులను ఒప్పించాలి కానీ... బెదిరించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి చిరంజీవి హితవు పలికారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ex Central minister  Congress MP  Chandrababu  Hudhud cyclone  chief minister  Antichrist  AP  

Other Articles