హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. దేశీయులకే కాదు వీదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు వేయించి రేప్ పార్టీలు జరుపుకుంటున్నారు. ఇదే తరహాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న మరో యువకుల బృందంపై పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ విచిత్రమేమంటే ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా వున్నది నైజీరియన్లే. 12 మందిలో ఏడుగురు నైజీరీయన్లు వుండగా, మరో 5 మాాత్రం మనవాళ్లు. అందులో రిసార్ట్ మేనేజనర్ ఒకరు. తమ రేవ్ పార్టీపై దాడి చేశారన్న అగ్రహంతో పోలీసులపైనే తిరగబడ్డారు. తామేం. మేం ఏం తప్పు చేశామో చెప్పండంటూ నిలదీశారు. ఈ సమయాన్ని అసరాగా చేసుకుని మరికొంతమంది యువతీ యువకులు రిసార్ట్స్ నుంచి పరారీ అయినట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనిబర్గ్ రిసార్ట్స్లో యువతులను వివస్త్రలుగా చేసి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఇవాళ తెల్లవారుజామున దాడులు చేశారు. రిసార్ట్స్ మేనేజర్తో పాటు పన్నెండు మంది యువకులు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. తిరగబడ్డనా వదలని పోలీసులు వారని స్టేషన్ కు తరలించారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వుంది. ఇంత జరిగినా.. మన పోలీసులు మాత్రం రిసార్ట్ లో రేవ్ పార్టీ జరగలేదని అంటున్నారు. అంతేకాదు అక్కడ కేవలం గెట్ టుగెదర్ మాత్రమే జరిగిందని నమ్మబలుకుతున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు. భారీ స్థాయిలో డబ్బులు ముట్టడంతోనే పోలీసులు ఈ మేరకు కథ మొత్తాన్ని మార్చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు రాజకీయ జోక్యం కూడా కారణమని తెలుస్తోంది. ఒక వేళ రిసార్ట్ లో జరిగింది కేవలం గెట్ టుగెదర్ అయితే.. నైజీరన్ల సహా 12 మందిని పోలీసులు ఎందుకు పోలిస్ స్టేషన్ కు తరలించారన్నది శేష ప్రశ్నగానే మిగులుతోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more