బీజేపీ అధికారంలో ఆర్థికమంత్రిగా కొనసాగుతున్న 61ఏళ్ల అరుణ్ జైట్లీ తాజాగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... ఆయన ఒక నర్సుపై మనసు పారేసుకున్నారని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు! దీనికంతటికి కారణం ఏమిటంటే.. ఈయనగారు ఒక నర్సుకు లేఖ రాయడమే! ఈ విషయం తెలుసుకున్న ప్రతిఒక్కరు ఆ లేఖలో ఏముందంటూ తెగ ఆరాటపడిపోతున్నారు. ఇంతవరకు ఎవరికీ లెటర్ రాయని అరుణ్.. హఠాత్తుగా ఒక నర్సుకు లేఖ రాయాల్సిన అవసరమేమొచ్చిందంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు.
అరుణ్ జైట్లీ నర్సుకు లేఖ ఎందుకు రాశారంటే... ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై ఎయిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే! ఆయన అనారోగ్యంగా బాధపడుతున్న సమయంలో అక్కడ బాగోగులు చూసుకోవడానికి ఒక నర్సుకు పనులు అప్పగించారు. దాంతో ఆమె అరుణ్ కి ఏ లోటు లేకుండా అన్నిరకాలుగా బాగానే చూసుకుంది. ఈ విధంగా ఆ నర్సు తను ఆసుపత్రిలో అందించిన సేవలు ఎంతో అమోఘమని అరుణ్ ఆమెను కొనియాడారు. ఆమె ఎంతో సమర్థవంతంగా, ప్రొఫెషనల్ తరహాలో తన పట్ల వ్యవహరించడాన్ని గొప్పగా భావిస్తున్నానంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అదీ సంగతి!
ఇదిలావుండగా.. నిజానికి అరుణ్ జైట్లీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడే నెలరోజులపాటు చికిత్సం పొందిన ఆయనకు ఇన్ఫెక్షన్ సోకడంతో అక్కడి నుంచి ఎయిమ్స్ కు తరలించారు. దీంతో ఆయన గతనెలలో ఆస్ట్రేలియాలో జరిగిన జి20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు జైట్లీ గైర్హాజరయ్యారు. కొన్ని వారాలకిందటే తిరిగి విధులకు హాజరైన ఆయన.. తనకు మంచి సేవలందించినందుకుగాను కృతజ్ఞత తెలుపుతూ.. ఎయిమ్స్ నర్సుకు లేఖ రాశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more