వారిద్దరూ భిన్న ధృవాలు, వారి అలోచనా విధానాలు కూడా వేరు. అంతేకాదు రెండు వేర్వేరు పార్టీలకు అధినేతలు, అయినా ఒక్కటిగా కలిసారు. వారే టీడీపీ అధినేత, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అప్పడెప్పుడో నాలుగు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పడు ఇరువురు నేతలు కలసి వేదికను పంచుకున్నారు. జనసేన తరపున పవన్.. మోడీ అద్యక్షతలోని బీజేపికి మద్దతు తెలిపిన సందర్భంగా, అదే వేదికపై చంద్రబాబు కూడా వున్నారు. కానీ ఇప్పుడలా కాదు. ఇక్కడేమీ ఎన్నికలు లేవు. అయినా సరే ఇద్దరు నేతలు ఒకే వేదికగా.. ఒకటిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రజలకు పిలుపునిచ్చారు.
కడలిశరంలా ప్రపండ వేగంతో వచ్చిన హదూద్ తుఫాను విశాఖ సహా ఉత్తరాంధ్రలో పెను విధ్వంస సృష్టించిన నేపథ్యంలో.. బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని వారు పిలుపునిచ్చారు. విశాఖలో పవన్ కళ్యాణ్ తో కలసి మీడియా ముందుకు వచ్చిన చంద్రాబాబు మాట్లాడుతూ.. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా సహకరిస్తున్నారన్నారు. ఖర్చు ఎంతైనా పరవాలేదు.. ప్రజల బాధలు తీరాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు.
సమయం, సందర్భం చూసుకుని పనికానిచ్చుకోవడంలో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబు, సందర్భం కాకపోయినా పనిలో పనిగా పవన్ కల్యాణ్ ను పోగడ్తలో ముంచెత్తాడు. బాధితులను ఆదుకోవటంలో పవన్ కల్యాణ్ ఎంప్పుడూ ముందుంటారని అభినందించారు. జీఎంఆర్, టాటా, ఇన్ఫోసిస్ సంస్థలు తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకురావటం అభినందనీయమన్నారు. 15రోజులు పడుతుందనుకున్న విద్యుత్ సమస్యను మూడు రోజుల్లో దారికి తెచ్చామని వెల్లడించారు. బంగాళ దుంపలకోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో 3సార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. భారీ నష్టం రాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ను అందిస్తున్నట్లు తెలిపారు. తుపాను బాధితులకు విశాఖ డైరీ 3.85లక్షలు, హెరిటేజ్ 65వేల లీటర్ల పాలు అందించినట్లు చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
హుదుద్ తుపాను కలిగించిన నష్టం బాధాకరం: పవన్ కల్యాణ్
హుదుద్ తుపాను విశాఖలో కలిగించిన నష్టం బాధాకరమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఉదయం విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తుపాను బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ.50లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయన్నారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ, ప్రజలకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయడం తగదని, చంద్రబాబుకు సహకరించాలని సూచించారు. విశాఖ స్మార్ట్ సిటీగా అవబోతున్న వేళ.. ఈ విపత్తుబాధ కలిగిస్తోందన్నారు. వైపరీత్యం సమయంలో ఐటీ విశాఖకు రాదంటూ విమర్శలు సరికాదన్నారు.ేర
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more