మనం ఏక్కడికైనా వెళ్తే.. అక్కడ జనసమూహ్మాన్ని చూస్తే.? వారి తరువాతే మీరని తెలిస్తే.. వామ్మో ఏమీ జనం అనుకుంటారు. కానీ మన దేశంలో ప్రపంచీకరణ తరువాత వచ్చిన విప్లవాత్మక మార్పులతో మొబైల్ ఫోన్ తప్పని సరి వస్తువుగా మారింది. మన దేశంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్లను వాడే వారి సంఖ్య ఎంతో తెలుసా..? జులై నెలాఖరు నాటికి దాని సంఖ్య ఎంతవరకు చేరుతుందో తెలుసా..? ఏదోలే కోటి మందో, లేక పది కోట్ల మందో అనుకంటున్నారా..? ఇంతకీ మన దేశ జనాభా ఎంత అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం కావాల్సిందే..
2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల మంది జనాభా వున్న మన దేశంలో టెలి కమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 92.43 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతుండగా.. జులై నెలాఖరు నాటికి ఈ సంఖ్య 95 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. ఆగస్టులో మొత్తం టెలికాం వినియోగదారుల సంఖ్య మరోసారి 95 కోట్లను దాటింది. 'జులై నెలాఖరు నాటికి 94.64 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉండగా.. ఆగస్టు చివరికల్లా వీరు 95.18 కోట్లకు పెరిగారని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది.
దాదాపు రెండేళ్ల తర్వాత సెల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లను చేరింది. తొలిసారి 2012 మార్చిలో 95 కోట్ల మంది వినియోగదారులు సెల్ ఫోన్ లను వాడినా.. అ తరువాత క్రమంగా తగ్గారు. మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించనున్నారు. దాటింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొబైల్, ఇంటర్నెట్ను వినియోగించే వారి సంఖ్య 91.87 కోట్ల నుంచి 92.43 కోట్లకు పెరిగింది. వీరిలో 80.72 కోట్ల మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. వినియోగదారుల విషయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలది 90 శాతం వాటా కాగా.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను వాడుతున్న వారు 9.84 శాతం మాత్రమే. ల్యాండ్లైన్ ఫోన్ల వినియోగదారులు 2.76 కోట్ల మంది నుంచి 2.75 కోట్లకు తగ్గారని ట్రాయ్ వెల్లడించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more