అంతర్జాతీయంగా విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో గత తొమ్మిది రోజులుగా కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. జమ్ము కాశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచి గత కొద్ది రోజులుగా వరస దాడులకు పాల్పడుతన్న పాక్.. భారత్ సైన్యం నుంచి ధీటైన సమాధానం రావడంతో తోకముడించింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో గత వారం రోజులుగా విపరీతంగా కాల్పులు, బాంబుదాడులకు పాల్పడుతూ పౌర ఆవాస ప్రాంతాల్లో కూడా భయాందోళనలు కలిగిస్తున్న పాకిస్థాన్ పై భారత్ సహా అన్ని దేశాలు విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి.
కాగా, ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల వైపు నుంచి కాల్పులు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ దళాలు అంతలా తిరగబడతాయని కూడా పాక్ దళాలు ఊహించలేదు. వాస్తవానికి పాక్ బలగాల కంటే రెట్టింపు సంఖ్యలో సరిహద్దుల్లో భారత సైన్యం ఉంది. తొలుత కొంత ఊరుకున్నా.. ప్రధాని వైపు నుంచి దీటుగా స్పందించాలన్న సంకేతాలు రావడంతో భారీగా విరుచుకుపడ్డినట్లు సమాచారం. గత రాత్ర నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సాంబాల జిల్లాలో దాడులకు పాల్పడలేదని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. కతువా జిల్లాలోని 4 బీఎస్ఎఫ్ స్థావరాలపై మాత్రం ఉదయం కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
కాగా గత తొమ్మిది రోజులుగా పాక్ రేంజర్ల కాల్పుల్లో తొమ్మిది మంది భారత పౌరులు మృతి చెందగా, 13 మంది భద్రత అధికరులతో పాటు మొత్తం 90 మంది గాయపడ్డారని తెలిపారు. పాక్ రేంజర్ల కాల్పుల ధాటికి సరిహద్దులోని 113 పల్లెలు ఖాళీ అయ్యాయని, 32 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. తొక ముడిచిన పాక్ మరో చోట కాల్పులకు తెగబడవచ్చునని రాజస్థాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు గస్తీని ముమ్మరం చేశాయి.
భారత్ దాడుల బాధిత దేశం పాక్: షరీఫ్
ఇదిలావుండగా, పక్కనోడిని గిల్లి.. తానే ఏడ్చినట్టుంది పాకిస్థాన్ తీరు. గత తొమ్మిది రోజుల కాల్పులకు భారత్ నుంచి ధీటుగా సమాధానం లభ్యం కావడంతో.. తొకముడిచిన పాక్.. ఈ కాల్పలుకు భారతే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. భారత దేశం అకారణంగా దాడులు చేస్తోందని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం ఆరోపించారు. భారత్ దాడుల బాధిత దేశం పాకిస్తానేనని ఆయన వ్యాఖ్యానించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని, దాన్ని బలహీనతగా భావించరాదని ప్రకటించారు. దీర్ఘకాలిక శాంతి కోసం సరిహద్దు వెంట కాల్పులను విరమిద్దమని అన్నారు.
ఇస్లామాబాద్లో త్రివిధ దళాధిపతులతో జాతీయ భద్రతా సమితి సమావేశం నిర్వహించిన అనంరతం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. గత పది రోజులుగా జరుగుతున్న కాల్పులు, ప్రతికాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. నిజానికి పాక్ సైనిక దాడులను భారత్ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. దీంతో పాక్ దళాలు కొంచెం వెనుకడుగు వేశాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more