ఎక్కువ చదివితే ఉన్న మతి పోతుంది అన్నట్లుగా.., మన నేతలకు రాజకీయ, పాలన అనుభవం పెరిగే కొద్ది విషయ పరిజ్ఞానం తక్కువ అవుతున్నట్లుంది. హైదరాబాద్ లో జరుగుతున్న మెట్రో పోలిస్ అంతర్జాతీయ సదస్సులో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రకటన ఇలాగే ఉంది. నగరంలో జరుగుతున్న మెట్రో పోలిస్ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన సుమారు 400మంది ప్రతినిధులు హాజరయ్యారు.
సదస్సులో ప్రసంగం చేసిన హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. మా ముఖ్యమంత్రి మంచి విజన్ ఉన్న నేత అని గర్వంగా చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను భారత దేశంలో టాప్ 6 నగరంగా నిలబెట్టాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షగా తెలిపారు. భాగ్యనగరంను వరల్డ్ క్లాస్ నగరంగా కేసీఆర్ అభివృద్ధి చేస్తారని ధీమాగా చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇలా ముఖ్యమంత్రిని పొగుడుతూ పుస్తకం చదివేశారు.
అంతా బాగానే ఉంది కానీ.., హైదరాబాద్ ను టాప్ 6నగరం చేస్తామన్న ప్రకటనే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మన నగరం దేశంలో టాప్ 6 స్థానంలో ఉంది.
ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఐదవ స్థానంలో ఉండేది ఇఫ్పుడు ఆరవ స్థానంకు పడిపోయింది. ప్రస్తుతం ఆరవ మహా నగరంగానే కొనసాగుతోంది. ఆరవ నగరంగా ఉన్న హైదరాబాద్ ను టాప్ 6 చేయటానికి ముఖ్యమంత్రి కష్ట పడతారు అని మేయర్ చెప్పటం ఏమిటి అని అంతా ప్రశ్నించుకుంటున్నారు. ఉన్నదాన్ని కొనసాగించటానికి కేసీఆర్, ప్రత్యేక కార్యాచరణలు కూడా కావాలా ఇదెక్కడి వింత ప్రకటన అని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మామూలుగా జరిగే సభలు, సమావేశాల్లో తప్పులు దొర్లాయి అంటే సరేలే అనుకోవచ్చు కాని.., అంతర్జాతీయ సదస్సుల్లో అదీ హైదరాబాద్ మేయర్ గా ఉండి భాగ్యనగరం గురించి తెలుసుకోకుండా మాజిద్ హుస్సేన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more