వాహనదారులకు ఇంధన సంస్థలు శుభవార్తను అందించాయి. దసరా కానుకగా పెట్రోల్ ధర లీటరుకు 54 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరి కొంతమేర ధర తగ్గనుంది. తగ్గింపు గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో స్థానిక పన్నులు కలుపుకుని ఢిల్లీలో లీటరు ధర 65 పైసలు తగ్గి రూ.67.86కు, ముంబైలో 68 పైస లు దిగి రూ. 75.73కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి. దీని ధర గత నెల 31న రూ.1.50 తగ్గడం తెలిసిందే. కాగా, 14.2 కేజీల సబ్సిడీయేతర గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 21 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ. 901 నుంచి రూ.880కి చేరుకుంది. విమాన ఇంధన ధర కిలోలీటరు3శాతం తగ్గి, రూ.67,525కు చేరింది.
లీటరు డీజిల్పై రూపాయి లాభం..
కాగా, ఐదేళ్లలో తొలిసారి కిందికి దిగనున్న డీజిల్ ధర తగ్గింపుపై నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చేంతవరకు వాయిదా వేశారు. చమురు కంపెనీలకు నష్టాలు పూడ్చుకోవడానికి లీటరు డీజిల్పై ప్రతినెలా 40 నుంచి 50 పైసలు పెంచుకునేందుకు యూపీఏ కేంద్ర కేబినెట్ 2013 జనవరిలో అనుమతించినప్పటినుంచి ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని చమురు శాఖ భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గుదల కారణంగా ఈ కంపెనీలకు సెప్టెంబర్ 16 నుంచి లీటరు డీజిల్ అమ్మకంపై వస్తున్న 35 పైసల లాభం ప్రస్తుతం ఒక రూపాయికి పెరిగింది. ధరల స్థితిగతులపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. మోదీకి లేఖ రాసినట్లు సమాచారం. మహారాష్ట్ర, హర్యా నా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర తగ్గింపునకు అనుమతి కోసం ఆ శాఖ ఎన్నికల కమిషన్కు లేఖ రాసిందని, తగ్గింపుపై మోదీ వచ్చాక నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రైవేటు చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ రేట్లను నిర్ధారిస్తున్నందున,ప్రభుత్వ కంపెనీల రక్షణ కోసం డీజిల్ ధర తగ్గించాలని చమురు శాఖ కోరుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more