తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ వివాదాస్పదంగా పంతాలకు పోయి మరి తీసుకొచ్చిన ఫాస్ట్ పధకం జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అంటే ప్రత్యేక దేశం కాదు., భారత్ లోనే అంతర్బాగం. అలాంటప్పుడు దేశ సమగ్రతను దెబ్బ తీసేలా ఎలా వ్యవహరిస్తారని మండిపడింది. తెలంగాణ విడుదల చేసిన జీవో రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ప్రభుత్వం మరోసారి జీవోను పరిశీలించాలని ఆదేశిస్తూ.., తదుపరి విచారణను 6వారాల పాటు వాయిదా వేసింది.
ఫాస్ట్ పధకం మతలబు
స్థానికతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.., ఫాస్ట్ పధకాన్ని తీసుకొచ్చింది. కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజులు చెల్లించాలనే ఉద్దేశ్యంతో.., ప్రత్యేకంగా ఈ పధకం రూపొందించారు. ఇందులో స్థానికత ఆధారంగా ఫీజులు చెల్లించటం జరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యార్థి తెలంగాణ స్థానికుడు కాకపోతే వారికి పీజులు చెల్లించదు. ఇందుకోసం 1956 ప్రామాణికంగా తీసుకువచ్చారు. అంటే ప్రస్తుత విద్యార్థుల పూర్వికుల తరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ 1956కు పూర్వం తెలంగాణలో ఉన్నట్లయితేనే వారు స్థానికులు. 1956తర్వాత వచ్చిన వారు ఫీజు చెల్లింపులకు అర్హులు కాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చాలా వివాదాలు జరిగినా మాట వినకుండా జీవో తెచ్చింది.
అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు ప్రజాస్వామిక వాదులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు వ్యతిరేకించారు. 7సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ స్థానికుడుగా రాజ్యాంగం గుర్తింపు ఇస్తుండగా.., తెలంగాణ ప్రభుత్వం అరవై సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవటం దారుణమని వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులకు చదువు కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో పిటిషన్లు వేశారు. ఇతర రాష్ర్టాల నుంచి కూడా చాలా ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చిన వారున్నారని వారికి కూడా ప్రభుత్వం ఫీజును పొందే అర్హత ఉండదని వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు., ప్రభుత్వం నిర్ణయం తీవ్రమైన విబేదాలను సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో పరిశీలించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.., కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more