అక్కడ వారి ప్రాబల్యం అధికం. అందుకనే అక్కడ వారం రోజుల పాటు రైళ్లను బంద్ చేశారు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా.. వారేనండి అన్నలు.. మరోవిధంగా మావోలు అంటాం. వారి ప్రాబల్యానికి తట్టుకోలేక రైల్వే శాఖ రైళ్లను బంద్ చేసిందంటే వారికున్న బలం ఏ పాటిదో అర్థమవుతోంది. మావోయిస్టుల వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో..బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఐదు డివిజన్ల పరిధిలో ఇవాళ్టి నుంచి వారంపాటు 28 పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు తూర్పు మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
బంద్లు, ఇతర సందర్భాల్లో గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఆర్ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి అరవింద్ కుమార్ రజక్ తెలిపారు. ధన్బాద్, సమస్తిపూర్ డివిజన్లలో 16, దనపూర్ డివిజన్లో 5, సోన్పూర్ డివిజన్లో 4, మొగల్సరాయ్ డివిజన్లో 3 పాసింజర్ రైళ్ల సేవలు నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా దోండ్రా బేస్క్యాంపుపై మావోయిస్టులు శనివారం రాత్రి దాడికి దిగారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో కాల్పులకు తెగబడ్డారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై పోరాటం చేసేందుకు 2006లో సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోని మారుమూల గ్రామాలను ప్రధాన రహదారుల పక్కకు తరలించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
మావోయిస్టుల సమాచారం తెలిసిన కొందరు యువకులను ఎస్టీవోలుగా నియమించుకొని అటవీ ప్రాంతంలో కూంబింగ్లు చేపట్టారు. ఈ క్యాంపులు ఏర్పడ్డాక గతంలో ఎర్రబోరు బేస్క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసి 32 మందిని హతమార్చారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దాడులు జరిపారు. ఇటీవల బేస్ క్యాంపులపై దృష్టి పెట్టని మావోయిస్టులు తాజాగా కుంట సమీపంలో ఉన్న క్యాంపుపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు దాడిని తిప్పికొట్టారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more