ప్రజలకే కాదు తన మంత్రివర్గంలోని మంత్రులకు కూడా ఊహించని షాక్ లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే మంత్రులకు పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చిన ఆయన తాజాగా మరో ఝలక్ ఇచ్చారు. తన మంత్రివర్గంలోని అమాత్యులందరికీ దసరాకు ముందే కానుకలు ఇచ్చారు. కానుకేమిటనుకుంటున్నారా..? మంత్రుల పేషీల్లో మీడియా అనుసంధాన అధికారి(ఎంఎల్ఓ)లను నియమిండం.. 20 మంది నిబద్దత కలిగిన టీడీపీ మద్దతుదారు జర్నలిస్టులను ఎంఎల్ఓలుగా నియమించేందుకు అధినేత పచ్చజెండా ఊపారు. మంత్రుల తరపున ఎంఎల్ఓలే అన్నింటికీ సమాచారం అందిస్తారు.
ఒక రకంగా ఇది మంచిదే అయినా.. మరో రకంగా ఆలోచిస్తే.. మంత్రలు వ్యవహారాలపై నిఘా పెట్టేందుకే ఈ ఏర్పాటని అమాత్యులు భావిస్తున్నారు. తమ శాఖలో జరిగే పనులను మీడియాకు వారే నెరుగా చెబితే.. మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లినట్లు అవుతుందనుకున్న మంత్రలుకు ఇది చేదు గుళికే అవుంతోంది. అంతే కాదు ఈ ఎంఎల్ఓలు సమాచారానంతా మీడియాతో పాటు అధిష్టాన వర్గానికి కూడా చేరవేస్తారన్న భయం కూడా అమాత్యులతో నెలకొంది. మంత్రులు లేని సమయాల్లో, ఇంకా మాట్లాడితే వున్న సమయాల్లోనూ వీరు సూడో మంత్రులుగా వ్యవహరించే ప్రమాదముందన్న అమాత్యులు ఆందోళన చెందుతున్నారట.
అధినేత నిర్ణయంపై కక్కలేక మింగలేక మంత్రులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు పీఆర్వోలను నియమించుకున్నారు. తాము నియమించుకున్న పీఆర్వోలను కొనసాగిస్తారో, లేదో తెలియక తలపట్టుకుంటున్నారు. ఎంఎల్ఓ వ్యవహారం తమకు తలనొప్పిగా తయారవుతుందని అమాత్యులు వాపోతున్నారు. వచ్చే వారం నుంచి తమ పనితీరును రోజువారీగా 'ట్యాబ్'ల ద్వారా సీఎం అంచనా వేయనున్నారన్న గుబులు మరోపక్క మంత్రులను పీకుతోంది.
ఎంఎల్ఓలను 'చినబాబు' లోకేష్, ఆయన స్నేహితుడు, సీఎంఓ కార్యాలయం ఓఎస్డీ అభిష్ట ఎంపిక చేశారని సమాచారం.. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలోనూ చక్రం తిప్పిన చినబాబు ఇప్పుడు కూడా కీలకపాత్ర పోషించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఎంఎల్ఓలకు నెలకు రూ.20 వేల నుంచి రూ. 28 వేల వరకు వేతనాన్ని ఫిక్స్ చేశారట, ఇతర అలవెన్సులు కూడా చెల్లించనున్నారని సమాచారం. అయితే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంలేని వారిని ఎంఎల్ఓలుగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలో తమకెదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు కిమ్మనడం లేదు. తామెన్ని చెప్పినా చివరకు చినబాబు మాటే నెగ్గుతుందని తెలుసు కాబట్టి అమాత్యులు నోరు మెదపడం లేదు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more