కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసేందుకు దేవాలయాలను టాయ్ లెట్లును ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల టాయ్ లెట్లు దేవాలయాలుగా మారుతున్నాయని విమర్శించారు. కేవలం టెంపుల్స్ గానే కాదు కొన్నిచోట్ల గోడౌన్లుగా., చిన్న రూములుగా కూడా మారుతున్నాయన్నారు. పేదలు టాయ్ లెట్ ప్రదేశాన్ని ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై నిర్వహించిన మీడియా సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్బంగా విలేఖర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.
దేశంలో టాయ్ లెట్ల సంఖ్య పెరిగిందనీ అయితే వినియోగం మాత్రం పెరగలేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల వాటిని పేదలు ఉపయోగించలేకపోతున్నారని చెప్పారు. మరుగుదొడ్లు కట్టించిన ప్రభుత్వం.. వాటిని వినియోగించేందుకు నీటిని ఇవ్వటంలో విఫలం అయిందన్నారు. దీంతో ప్రజలు వాటిని ఇతర అవసరాలు, పనుల కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. కొన్నిచోట్ల టాయ్ లెట్ల పునాదులపై దేవాలయాలు నిర్మించటం స్వయంగా చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. నీటి లభ్యత లేకుండా నిర్మించి ఏం లాభమో యూపీఏ పెద్దలు చెప్పాలన్నారు.
యూపీఏ హయాంలో గ్రామీణాభివృద్ధి పధకాల కింద పేద కుటుంబాలకు ఉచితంగా, ఆర్ధిక సాయం చేసి ప్రభుత్వమే టాయ్ లెట్లు కట్టించింది. అయితే దీనిలో కూడా చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సిమెంటు, టాయిలెట్ నిర్మాణం నాసిరకంగా ఉందని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చాలా చోట్ల మరుగుదొడ్డి కట్టకుండానే తలుపులు, భూగర్బంలో వేసే రింగులను తీసుకెళ్ళారని తేలింది. అంతేకాకుండా కొందరు అక్రమంగా పేదల పేరుతో మరుగుదొడ్లను మంజూరు చేసి డబ్బులు దండుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉన్నవి కూడా నిరుపయోగమే అని మంత్రి విమర్శలు చేస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more