ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. మనిషిని పతనావస్థకు తీసుకువచ్చ హెచ్.ఐ.వి. వైరస్ కు విరుగుడు వచ్చేస్తోంది. ఈ భయకంర వ్యాధికి కాకతీయ యునివర్సిటి మందు కనిపెట్టింది. అది కూడా తెలంగాణలో సహజసిద్దంగా విరివిగా దొరికే చెట్లతో కావటం విశేషం. ప్రస్తుతం ప్రొఫెసర్లు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. వారు రూపొందంచిన మందు ప్రాధమికంగా ఎయిడ్స్ వైరస్ ను కట్టడి చేస్తుందని నమ్మిన కేంద్రం పరిశోధనలు చేసేందుకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదే నిజం అయితే ఇక ఎయిడ్స్ తో చనిపోయారు అనే మాటలు త్వరలో మనకు వినబడవు.
బోటనీ ప్రోఫెసర్ సృష్టి
కాకతీయ యునివర్సిటీలోని బాటనీ ( వృక్షశాస్ర్తం) ప్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల ‘తెలంగాణ అడవుల్లో నివసించే గిరిజనులు- వనమూలిక వైద్యం’ అనే అంశంపై పరిశోధనలు జరిపారు. రాష్ర్టంలోని వరంగల్; ఖమ్మం, అదిలాబాద్, అడవుల్లో గిరిజనులు, ఆదివాసీలు ఉపయోగించే మూలికల వివరాలను తెలుసుకున్నారు. వారు వైద్యం కోసం 65 జాతులకు చెందిన ఔషదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. వీటిలో ఎక్కువగా పిండికూర, బ్రహ్మమేడి, నరమామిడి, పులిచేరు, సోమిడిచెక్క, అడవి తంగేడు, తిప్పతీగ, పున్నరవ ఉపయోగిస్తున్నట్లు గుర్తించి వాటిపై పరిశోధనలు జరిపారు. వీటి వల్ల ఎక్కువగా పాముకాటు, రక్త శుధ్ది, వీర్యవృద్ధి, సుఖవ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులతో పాటు ఇతర రోగాలు నయం అవుతాయని తెలుసుకున్నారు.
వీటిలో అడవి తంగేడు, తిప్పతీగను సుఖవ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారని పరిశోదనల్లో తెలిసింది. ఈ రెండు మొక్కలపై పరిశోధనలు జరిపి ప్రొఫెసర్లకు అద్బుత విషయం తెలిసింది. ఈ రెండు మొక్కలు ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తి చేసే వైరస్ వృద్ధిని తగ్గించినట్లు ప్రయోగంలో తేలింది. హెచ్ ఐ వి వైరస్ ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి వ్యాపిస్తుంది. శరీంలోకి ప్రవేశించాక వైరస్ ఎదుగుదల అనేది అందులో ఉండే ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైములపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైముల వేగంగా పనిచేస్తే.., వైరస్ త్వరగా అభివృద్ధి చెందుతుంది. అడవి తంగేడు ఆకులగ, తిప్పతీగ మొక్కలో ఉండే ఔషధ గుణాలకు ఈ ఎంజైముల పనిచేసే గుణం తగ్గించే శక్తి ఉందని గుర్తించారు. ఈ విషయం కేంద్రంానికి తెలపగా.., శాస్ర్త, సాంకేతిక శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. అటు విదేశాల్లో కూడా వీరి పరిశోధనలకు ప్రశంసలు వచ్చాయి. పలు పత్రికలు, మ్యాగజైన్లు ఈ పరిశోధనలపై కధనాలు ప్రచురించాయి.
కేంద్రం ప్రోత్సాహం
భయంకర వ్యాధికి విరుగుడు కనిపట్టే పనిలో ఉన్న ప్రొఫసర్ కృషికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. పరిశోధనలు కొనసాగించేందుకు కేంద్ర శాస్ర్త సాంకేతిక శాఖ గతేడాది 21లక్షల రూపాయలు విడుదల చేసింది. అదేవిధంగా వర్సిటీ బయో టెక్నాలజి డిపార్ట్ మెంటు 47 లక్షలు విడుదల చేసింది. దీంతో వీరి పరిశధనలను మరింత అధునాతనంగా.., అన్ని కోణాల్లో చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రయోగం ఫలించి మాయ వైరస్ కు మందు కనిపెడితే లక్షల మందికి ప్రాణం పోసినవారవుతారు. భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే రోగాన్ని నయం చేసిన వైద్యులుగా వీరి పేరు చరిత్రకెక్కటంతో పాటు., తెలుగుదనం, తెలంగాణ గొప్పదనం నలుదిశలా వ్యాప్తి చెందుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్తారి అండ్ టీం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more