మెదక్ ఉపఎన్నిక పుణ్యమా అని తెలంగాణలో రాజకీయ పార్టీల మద్య మళ్లీ మాటల యుద్ధం మొదలయింది. బహిరంగ ప్రచారాలకు సిద్దమవుతున్న నేతలు.., పార్టీ కార్యాలయాల్లో ప్రాక్టిస్ మ్యాచ్ ఆడుతున్నారు. పొరుగు పార్టీలను తిట్టిపోయటంపై ఫోకస్ పెట్టారు. నేతల చేరికల అంశంగా విమర్శలు మొదలు పెట్టారు. జగ్గారెడ్డిని చేర్చుకోవటంపై దుమారం రేపుతున్న టీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి గట్టి జవాబిచ్చారు. గులాబిదళం గురివింద కింద నలుపు చూసుకుని మాట్లాడాలన్నారు. జగ్గారెడ్దికి టికెట్ ఇస్తే భూమి బద్దలయినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యమం సమయంలో వైసీపీలో ఉండి తెలంగాణవాదులపై మానుకోటలో రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖను కారు ఎక్కించుకున్నపుడు టీఆర్ఎస్ నీతి ఏమయిందని ప్రశ్నించారు. అదే విధంగా రాయలసీమ కోసం పట్టుబట్టిన మజ్లిస్ నేతలతో కలిసి తిరుగుతున్నారు. దీన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. తాము చేస్తే తప్పు.., టీఆర్ఎస్ చేస్తే ఒప్పయిందా సమాధానం చెప్పాలని గులాబీ దళాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ కు ఒక నీతి.., ఇతర పార్టీలకు మరో నీతి సరైన విధానమా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఒకే రోజు మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటే తప్పు లేదు కదా అని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ లో చేరితే పవిత్రులు.., బీజేపీలో చేరితే పాపాత్ములు అనే విధంగా కేసీఆర్ వరగ్ం గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. జగ్గారెడ్డికి తెలంగాణ ప్రజలు మెదక్ పగ్గాలు అప్పగించటం ఖాయంగా కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ తీసుకురావటంలో చొరవచూపినా రాష్ర్టంలో బీజేపి ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటుకోవాలనుకుంటోంది. అనూహ్యంగా జగ్గారెడ్డి కమలం జెండా పట్టి.., మెదక్ నుంచి పోటికి దిగుతున్నారు. 13న జరిగే ఉప ఎన్నికకు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more