తెలుగు సినీ ఇండస్ర్టీలో విభిన్నమైన కధలతో సినిమాలు తీసే జగన్నాధ్ కష్టాల్లో చిక్కుకున్నారు. దర్శకుడిపై పోలిసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైం స్టేషన్ పోలిసులు పూరిపై కేసు పెట్టారు. ఆరేళ్ళ క్రితం జూబ్లిహిల్స్ లో ఓ స్థలం కొనేందుకు బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇప్పుడా అప్పే ముప్పు తెచ్చింది. అప్పును ఇంతవరకు తీర్చకపోవటంతో పాటు.., ఈ స్థలంపై వివాదం కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగానే అప్పు చెల్లించకపోవటంతో పూరితో పాటు ఆయన భార్య లావణ్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అరెస్టు చేస్తారన్న అనుమానంతో పూరి జగన్నాధ్ ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించారు. గురువారం నాంపల్లి కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సోమవారం వరకు కోర్టు పూరికి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత పరిణామాలు పరిశీలించి స్పందిస్తామని స్పష్టం చేసింది. దీంతో సోమవారం తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలయింది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని పూరి ఫ్యామిలీ తీవ్రంగా ఆలోచిస్తోంది.
అటు పూరి జగన్నాధ్ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రాజు అనే వ్యక్తితో పాటు మరో బిల్డర్ తనను మోసం చేశారని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ తీసుకున్న పోలిసులు.., ఆధారాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధర్శకులు తమ సినిమాలు, కధల విషయంలో కేసులు నమోదైన సందర్బాలున్నాయి. కాని ఇలా భూ వివాదాలు, అప్పుల కేసుల్లో ఇరుక్కున్నవారు చాలా తక్కువ. అప్పు ఎప్పటికైనా ముప్పు అన్నట్లు.., ఇప్పుడది పూరి నెత్తికెక్కి కూర్చుంది. ఈ బరువు త్వరగా దిగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more