మెదక్ జిల్లా లోక్ సభ ఎన్నికలు రానురాను మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు ఈ ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందంటూ డప్పులు వాయించుకుంటూ.. ఒకర్నొకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే జగ్గారెడ్డి ఇలా బీజేపీలో చేరడం వెనుక పవన్ కల్యాణ్ హస్తముందనే వార్తలు రాజకీయరంగంలో జోరుగా కొనసాగుతూనే వున్నాయి. ఈ విషయంపై కొంతమంది నాయకులు విమర్శలూ చేస్తే.. మరికొంత మాత్రం పొగడ్తలతో పవన్ కల్యాణ్ ను ముంచెత్తుతున్నారు. ఇందులో భాగంగానే హరీష్ రావు కొన్ని ఘాటు కామెంట్లను గుప్పించారు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిఫార్సులతో జగ్గారెడ్డిని ఎంపిక చేసే దయస్థితికి బీజేపీ చేరుకుందని హరీష్ రావు విమర్శించారు. అలాగే ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయకముందే టీఆర్ఎస్ విజయం ఖరారైందని అన్నారు. రెండో స్థానంకోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ఉద్యమకారుడికి, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతోందని.. ఈ పోటీలో తెలంగాణ విజయం ఖాయమని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. ఆయన నేరుగా పవన్ కల్యాణ్ ను ద్రోహి అయితే చెప్పలేదు కానీ.. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా గళం విప్పినవారిని ద్రోహులుగా పేర్కొన్నారు. అంటే.. పరోక్షంగా పవన్ ను కూడా తిట్టినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆంధ్రామంత్రులకు వత్తాసు పలుకుతూ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులపైన కేసులు పెట్టించిన వారిని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలిపిందని అన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణవాదులపై దాడులకు దిగుతూ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదంటూ సోనియా గాంధీకిలేఖ ఇచ్చిన జగ్గారెడ్డిని బీజేపీ బరిలోకి దింపిందన్నారు. ఇటువంటివారిని తమ అభ్యర్థులుగా ప్రకటించిన బీజేపీ-టీడీపీ పార్టీలది సెల్ఫ్ గోల్ అని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా ఆ పార్టీలు ఓటమికి అంగీకరించాయన్నారు. మెదక్ స్థానం తమకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more