ఎబోలా వైరస్.. ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు అందరినీ వణికించేస్తున్న ఒక ప్రాణాంతకమైన వ్యాధి! ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో నివాసముండే రెండు సంవత్సరాల పిల్లాడు నుంచి మొదలైన ఈ వైరస్... ఇప్పుడు ప్రపంచదేశాల్నే గడగడలాడించేస్తోంది. ఈ వైరస్ సోకిందంటే చాలు.. మరణం ఖాయం! ఇప్పటికే దాదాపు 1300మందికి పైగా ఈ వైరస్ కు బలైపోయారు. అంతెందుకు... ఈ వ్యాధి సోకినవారికి ఎన్నోజాగత్తలతో చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా దీనికి కుప్పకూలిపోతున్నారు. దీంతో ఈ వ్యాధిసోకిన వారికి చికిత్స ఇవ్వడానికి డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక వైరస్ సోకిన వ్యక్తులనైతే బయటికి వెళ్లినివ్వకుండా ఎక్కడున్నారో అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ వారు చనిపోతే.. ఎంతో భద్రతల మధ్య వారి శవాల్ని కాల్చకుండా పూడ్చేస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈ వైరస్ మన భారత్ కు సంక్రమించిందనే వార్తలు అప్పట్లో బాగానే షికార్లు చేశాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన చెన్నైకి వచ్చిన వ్యక్తికి ఎబోలా వైరస్ సోకిందంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో అతనికి శస్త్రచికిత్సలు చేసి, పరీక్షలు నిర్వహించగా అదంతా తప్పని తేలిపోయింది. అలాగే విదేశాల నుంచి పర్యటించేందుకు ముంబయికి వచ్చిన వ్యక్తి ఎబోలా వైరస్ బారిన పడ్డాడంటూ భారీగా పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా వదంతులుగానే వుండిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ ఎబోలా వైరస్ ఒక తెలుగు వ్యక్తి బలైపోయాడు. చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం చిటిపిరాళ్ల ప్రాంతానికి చెందిన గజేంద్రరెడ్డి అనే తెలుగు వ్యక్తి ఈ ఎబోలా వైరస్ బారిన పడి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. అయితే ఈ వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందుతుందని భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇతను మరణించింది మన ఇండియాలో కాదు.. కెన్యాలో!
గత కొన్నేళ్లక్రితం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్యోగ నిమిత్తం కెన్యాకు వచ్చిన ఈ తెలుగు వ్యక్తి.. అనుకోకుండా ఎబోలా వైరస్ కు గురయ్యాడు. మొదట దీని ప్రభావం అంతగా అనిపించలేదు కానీ.. రానురాను అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను ఈనెల 4వ తేదీన తీవ్ర జ్వరంతో కెన్యాలోని నైరోబిలో ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు చేరాడు. అప్పుడు ఇతను ఎబోలా వైరస్ కు గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతుండగానే ఇతను 14వ తేదీన కోమాలోకి వెళ్లిపోయాడు. అనంతరం 18వ తేదీన మృతి చెందాడు. అయితే ఈ వార్త బుధవారం ఉదయం 10 గంటలకు తన భార్య, కుమార్తె బెంగుళూరుకు రావడంతో అక్కడ వెలుగులోకి వచ్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more