Indian mujahidin planned to send poison letters to kill targets

delhi police, indian mujahidin, terrorists, simi, isis, taliban, army, police, blasts, mumbai blasts, dilsukhnagar blasts, court, poison letters, letters, target, kill, latest updates

delhi police said that indian mujahidin planned to send poison letters to kill targets : im terrorists planned to send soaked poison letters to kill targets sasy delhi police

విషపు లెటర్స్ పంపాలని టెర్రరిస్టుల కుట్ర

Posted: 08/20/2014 04:19 PM IST
Indian mujahidin planned to send poison letters to kill targets

దేశంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. భారత దేశంలో ప్రశాంతతకు భంగం కల్గించి, ఇక్కడి ప్రజల ప్రాణాలే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటివరకు బాంబు దాడులు, నకిలీ కరెన్సి నోట్లతో దేశ సామాజిక, ఆర్ధిక లక్ష్యాలపై దాడి చేస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వీరి ఆలోచనలు వింటేనే వణుకుపుడుతోంది. తమ లక్ష్యాలకు విషపు లేఖలు పంపాలని ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నట్లు ఢిల్లీ పోలిసులు వెల్లడించారు. వారి అదుపులో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు తహసీన్ అక్తర్, వకర్ అజార్ ను విచారణలో ఈ విషయాలు వెల్లడియినట్లు పోలిసులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు దేశంలో అక్రమంగా ఓ ఆయుధ ఖర్మాగారాన్నే నడిపేందుకు కుట్రకు తెగబడినట్లు చెప్పారు.

మార్కెట్లో దొరికే మెగ్నిషియం సల్ఫేట్, అసిటోన్, క్యాస్టర్ సీడ్స్ ద్వారా విషం తయారు చేసి వాటిని లెటర్లకు పూసి సోక్ చేసి టార్గెట్ చేసుకున్న వ్యక్తులకు  పంపాలని కుట్రలు చేసినట్లు విచారణలో ఉగ్రవాదులు అంగీకరించారు. ఉగ్రవాదుల నుంచి ఈ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీట్లో వెల్లడించారు. పోలిస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయటంతో ఇటువంటి కుట్రలను ముందుగానే అడ్డుకోగలుగుతున్నాం లేదంటే. ఉగ్రవాదులు తయారు చేసిన విషపు లేఖలు ఈ మంత్రికో, ముఖ్యమంత్రికో పంపితే వారు., వాటిని తెరిచి చూస్తే ఎలా ఉండేది పరిస్థితి. ఊహించుకుంటేనే వణుకుపుడుతోంది. పాకిస్థాన్ లో పుట్టి భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటే వారి దుర్బుద్ధి, ఆ దేశంకు భారత్ పై ఉన్న వైఖరి అలాంటిది అనుకోవచ్చు. కాని మన దేశంలో పుట్టి, పెరిగి, పాక్ కుట్రలో భాగస్వాములయి భారత్ పైకే తుపాకులతో తెగబడితే వారిని ఏమనాలి. తల్లిపాలు తాగి రొమ్ము తన్నే వారిని ఎలా శిక్షించాలి.

ఇండియన్ ముజాహిదీన్, సిమి, లష్కరే తోయిబా ఇలా ప్రతి ఒక్కటీ భారత్ కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఉగ్రవాద సంస్థలే. వీరి లక్ష్యమంతా భారత దేశ వినాశనమే ఇందుకోసం తమను తాము నాశనం చేసుకోవటానికి కూడా సిద్ధపడతారు ఉగ్రవాదులు. అన్నిటికి తెగించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రమాణం చేసి తుపాకి చేతబడుతున్నారు. వీరికి పాకిస్థాన్ ఆర్మీ నేరుగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మన ఇంటలిజెన్స్ దగ్గర ఆధారాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే వెల్లడించారు. పోనిలే అని ఊరుకుంటున్నాం కాబట్టి తీవ్రవాదం పెచ్చుమీరుతోంది. అదే ఒక్కసారి భారత ఆర్మీ విచక్షణ కోల్పోతే ఉగ్రవాదం సమూలంగా పెకిలించబడుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian mujahidin  poison letters  delhi police  latest news  

Other Articles