దేశంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. భారత దేశంలో ప్రశాంతతకు భంగం కల్గించి, ఇక్కడి ప్రజల ప్రాణాలే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటివరకు బాంబు దాడులు, నకిలీ కరెన్సి నోట్లతో దేశ సామాజిక, ఆర్ధిక లక్ష్యాలపై దాడి చేస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వీరి ఆలోచనలు వింటేనే వణుకుపుడుతోంది. తమ లక్ష్యాలకు విషపు లేఖలు పంపాలని ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నట్లు ఢిల్లీ పోలిసులు వెల్లడించారు. వారి అదుపులో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు తహసీన్ అక్తర్, వకర్ అజార్ ను విచారణలో ఈ విషయాలు వెల్లడియినట్లు పోలిసులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు దేశంలో అక్రమంగా ఓ ఆయుధ ఖర్మాగారాన్నే నడిపేందుకు కుట్రకు తెగబడినట్లు చెప్పారు.
మార్కెట్లో దొరికే మెగ్నిషియం సల్ఫేట్, అసిటోన్, క్యాస్టర్ సీడ్స్ ద్వారా విషం తయారు చేసి వాటిని లెటర్లకు పూసి సోక్ చేసి టార్గెట్ చేసుకున్న వ్యక్తులకు పంపాలని కుట్రలు చేసినట్లు విచారణలో ఉగ్రవాదులు అంగీకరించారు. ఉగ్రవాదుల నుంచి ఈ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీట్లో వెల్లడించారు. పోలిస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయటంతో ఇటువంటి కుట్రలను ముందుగానే అడ్డుకోగలుగుతున్నాం లేదంటే. ఉగ్రవాదులు తయారు చేసిన విషపు లేఖలు ఈ మంత్రికో, ముఖ్యమంత్రికో పంపితే వారు., వాటిని తెరిచి చూస్తే ఎలా ఉండేది పరిస్థితి. ఊహించుకుంటేనే వణుకుపుడుతోంది. పాకిస్థాన్ లో పుట్టి భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటే వారి దుర్బుద్ధి, ఆ దేశంకు భారత్ పై ఉన్న వైఖరి అలాంటిది అనుకోవచ్చు. కాని మన దేశంలో పుట్టి, పెరిగి, పాక్ కుట్రలో భాగస్వాములయి భారత్ పైకే తుపాకులతో తెగబడితే వారిని ఏమనాలి. తల్లిపాలు తాగి రొమ్ము తన్నే వారిని ఎలా శిక్షించాలి.
ఇండియన్ ముజాహిదీన్, సిమి, లష్కరే తోయిబా ఇలా ప్రతి ఒక్కటీ భారత్ కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఉగ్రవాద సంస్థలే. వీరి లక్ష్యమంతా భారత దేశ వినాశనమే ఇందుకోసం తమను తాము నాశనం చేసుకోవటానికి కూడా సిద్ధపడతారు ఉగ్రవాదులు. అన్నిటికి తెగించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రమాణం చేసి తుపాకి చేతబడుతున్నారు. వీరికి పాకిస్థాన్ ఆర్మీ నేరుగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మన ఇంటలిజెన్స్ దగ్గర ఆధారాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే వెల్లడించారు. పోనిలే అని ఊరుకుంటున్నాం కాబట్టి తీవ్రవాదం పెచ్చుమీరుతోంది. అదే ఒక్కసారి భారత ఆర్మీ విచక్షణ కోల్పోతే ఉగ్రవాదం సమూలంగా పెకిలించబడుతుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more