ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాష్ర్ట 2014-15 సంవత్సర బడ్జెట్ ను ఆ రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 1,11,884 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 85,151 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 26,673 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. రాష్ర్ట ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు, రెవిన్యూ లోటు రూ.6,064 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. . కొన్ని సంవత్సరాలుగా అవినీతి, కుంభకోణాలు రాష్ర్టంలోరాజ్యమేలాయని.., వీటి ప్రభావంతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. అస్థవ్యస్థ వ్యవస్థను సరిదిద్దుకుంటూ.., అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అవినీతిలో కూరుకపోయిన రాష్ర్టాన్ని తిరిగి పునరుత్తేజం చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అటు విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని యనమల చెప్పారు. విభజన సందర్బంగా ఆదాయ పంపిణి సరిగా జరగలేదన్నారు. అంతేకాకుండా పునర్విభజన చట్టంలో అనేక సమస్యలను గత కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సక్రమ ప్రణాళికలకు అవకాశం లేకుండా విబజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
హోంశాఖకు రూ.3,737 కోట్లు
విపత్తు నిర్వహణ శాఖకు రూ.403 కోట్లు
ఐటీ శాఖకు రూ. 111 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 615 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ. 8465 కోట్లు
ఇంధన శాఖకు రూ. 7164 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాకు రూ. 371 కోట్లు
యువజన సర్వీసుల శాఖకు రూ. 126 కోట్లు
వికలాంగ సంక్షేమం, వృద్ధులకు రూ.65 కోట్లు
మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 1,049 కోట్లు
బీసీ సంక్షేమ శాఖకు రూ. 3,130 కోట్లు
గిరిజన సంక్షేమ శాఖకు రూ. 1,150 కోట్లు
రోడ్లు, భవనలశాఖ రూ.2,612కోట్లు
మౌలిక వసతులకు రూ.73కోట్లు
అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ రూ. 418కోట్లు
ఉన్నత విద్యశాఖకు రూ.2,275 కోట్లు
ఇంటర్ విద్యకు రూ.812 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.12,595 కోట్లు
గ్రామీణాభివృద్ధి కోసం రూ. 6,094 కోట్లు
పంచాయతీ రాజ్శాఖకు రూ.4,260 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు రూ.4,388 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు
పట్టణాభివృద్ధిశాఖకు రూ.3,134 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు రూ1,115 కోట్లు
తమ ప్రభుత్వం కేవలం కేటాయింపులకే పరిమితం కాదని మంత్రి యనమల స్పష్టం చేశారు. కేటాయించిన ప్రతి రూపాయిని ఖర్చు పెడతామన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా బడ్జెట్ ఖర్చు చేస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించిన అనేక ప్రజా సమస్యల పరిష్కారం ఆదారంగా బడ్జెట్ లో కేటాయింపులు రూపొందించామన్నారు. బీసీలకు కూడా ప్రత్యేక ఉప ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో కొత్త ఒరవడి అవసరమన్నారు. సమగ్ర ప్రజాభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని యనమల తెలిపారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more