వేగంగా రైలు కూత పెట్టుకుంటూ పట్టాలపై పరుగులు తీసుకుంటూ వస్తూంది. అయితే ఇంతలో.. ఒక బడాయి ఆవు, మరో లడాయి ఎద్దు కయ్యానికి కాలుదువ్వి.. రంకెలు వేస్తూ . కొమ్ములతో కొట్టుకోవటం మొదలుపెట్టాయి. ఎవరి బలం ఎంతో తెల్చుకోవటానికి ..తోకలు రెండు పైకి ఎత్తి రైల్వే పట్టాలపై వీరోచితంగా పోరాడుకుంటున్నాయి. అయితే రైలు పట్టాలపై లాల్ కూనా ఎక్స్ ఫ్రెస్ వేగంగా వస్తున్నకొద్ది ..రైల్వే ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
ఆవు, ఎద్దు సహజంగా కొట్టుకోవటం చాలా అరుదుగా జరుగుతాయి. ఆవు , ఆవు కొట్టుకోవటం, ఎద్దు ఎద్దు కొట్టుకోవటం సహజం చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఆవు, ఎద్దు కొట్టుకోవటం చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆవు, సహజంగా ఎద్దు చూస్తే .. దూరంగా పారిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం నువ్వా-నేనా అంటూ పోటీ దిగటం చాలా ఆశ్చర్యంగా ఉంది.
అయితే ఆవు ఎద్దు అలా కొట్టుకుంటూ పట్టాలపైకి వచ్చిన లాలా కునా ఎక్స్ ప్రెస్ ఇంజన్ ను ఢీ కొట్టాయి. దీంతో ఆ ఎక్స్ ప్రెస్ రైలు నాలుగు స్లీపర్ కోచ్లు పట్టాలు తప్పాయి. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని దాలిగంజ్ రైల్వేస్టేషన్ సమీపంలో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఆ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైలు ప్రయాణికులలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. రైలు కోచ్ లను పట్టాలపైకి ఎక్కించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఘటన లో ఆవు, ఎద్దు తీవ్రంగా గాయపడ్డాయి. అయితే వెంటనే రైల్వే అధికారులు.. పశువైద్యశాలకు ఆవును, ఎద్దును తరలించారు. కానీ ఆవు పరిస్థితి .. విషమమంగా ఉందని .. పశువైద్యులు చెబుతున్నారు. కానీ ఎద్దుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు దృవీకరించారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more