ఫ్లిప్ కార్ట్ ఇ కామర్స్ సంస్థ విజయగాధ ఇది-
సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ (ఇద్దరూ బంధువులు కారు) ల ఉమ్మడి సంపదలు 1 బిలియన్ డాలర్లకు పైబడే ఉన్నాయని, దేశంలోనే ఐటి రంగంలో రెండవ స్తానంలో ఉన్న ఇన్ఫోసిస్ సహ సంస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని ల కుటుంబ సభ్యుల ఆస్తులతో దీటుగా ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల ఫండ్ ని కంపెనీలోకి తీసుకునిరావటం, అందులో 15 శాతం బన్సల్ ల ఉమ్మడి వాటా ఉండటంతో వాళ్ళ ఆస్తుల విలువ రూ.6000 కోట్లని అంచనా వెయ్యవచ్చు.
ఇన్ఫోసిస్ సహ సంస్థాపకులతో పోలిస్తే, నారాయణ మూర్తి కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.8700 కోట్లు, నిలేకని కుటుంబ సభ్యుల ఆస్తులు 6500 కోట్లు కాబట్టి ఫ్లిప్ కార్ట్ సహసంస్థాపకుల ఆస్తులు
వారిద్దరి స్థాయికీ చేరుకుంటున్నాయని చెప్పవచ్చు.
అంతేకాదు, ఇన్ఫోసిస్ ను వీడి వెళ్ళిపోతున్న సిఇవో ఎస్ డి షిబూలాల్ కుటుంబ ఆస్తులు రూ.4300 కోట్ల కంటే ఎక్కువ. ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన మరో సహసంస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.6500 కోట్లు.
ఇక సంస్థాపరంగా పోలిస్తే, ఇన్ఫోసిస్ 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంస్థ. ఆ సంస్థ సంపాదించిన మార్కెట్ విలువు 30 బిలియన్ డాలర్లు. ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా విలువ 7 బిలియన్ కోట్లు.
అందుకు ఆ సంస్థ పనిచేసింది 7 సంవత్సరాలు. 2011 నుంచి 2014 వరకు మూడు సంవత్సరాలలో ఫ్లిప్ కార్ట్ 10 మిలియన్ డాలర్ల టర్నోవర్ ని 2 బిలియన్ డాలర్లు అంటే 100 రెట్లు పెంచుకుంది.
ఎందుకింత అభివృద్థి ఇంత తక్కువ కాలంలో కలిగిందీ అంటే భారత దేశంలో ఇ కామర్స్ విపరీతంగా పెరగటమే కారణం. భారతదేశంలో భవిష్యత్తులో రిటైల్ వ్యాపారమంతా ఇంటర్ నెట్ ద్వారా జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ సంస్థలో పెట్టుబడులను పెంచే సమయంలో సహసంస్థాపకులు బన్సల్స్ ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. సంస్థలో జరిగిన అపూర్వమైన అభివృద్ధి రేటు విషయంలో మాట్లాడుతూ, మేము ఊహించినదానికి ఎన్నో రెట్లు వృద్ధి చెందిందని సంతోషాన్ని వ్యక్తపరచారు.
ఫ్లిప్ కార్ట్ కి పోటీదార్లు అమెజాన్, స్నాప్ డీల్ ఇ కామర్స్ వెబ్ సైట్స్
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more