చేస్తే మా గొప్ప, చెయ్యలేనిదానికి తప్పంతా కాంగ్రెస్ ది. ఇదీ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యన నాయుడు చెప్తున్నది. సామాన్యంగా ఏ రాజకీయ పార్టీయైనా అలాగే మాట్లాడుతుంది కానీ మోదీ ప్రభుత్వం నుంచి ప్రజలు కొంచెం భిన్నంగా, కొంచెం ఉన్నతంగా, కాస్త పారదర్శకంగా ఉంటుందని ఆశించారు.
కాంగ్రెస్ పార్టీ ధరలను నియంత్రించలేకపోయిందన్న ఆరోపణతో ఎన్నికల ముందు భాజపా ప్రధనంగా ప్రజలలోకి వెళ్ళింది. హైద్రాబాద్ లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు, అదే కాంగ్రెస్ విధానం వలన ధరలింకా నియంత్రణలోకి రాలేదని చెప్పారు. మేమొచ్చి 2 నెలలేగా అయింది అంటున్నారు వెంకయ్య నాయుడు. వచ్చి 60 రోజులైందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
కాంగ్రెస్ పార్టీ చేసిన మరో ఆరోపణ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదని, అందుకే మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిందని. అందుకు సమాధానంగా, పార్లమెంట్ లో ప్రవేశపెట్టటానికి మా దగ్గర ఎన్నో బిల్లులున్నాయి. ఇన్సూరెన్స్, సెబి, జ్యుడిషయల్ అప్పాయింట్ మెంట్స్ లాంటి బిల్లులు తయారుగా ఉన్నాయన్నారు వెంకయ్య నాయుడు.
బ్రిక్స్ మీటింగ్ లో జరిగింది పార్లమెంట్ ల వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. కానీ అన్నిసార్లు బ్రిక్స్ మీటింగ్ కి వెళ్ళిన మన్సోహన్ సింగ్ ఏనాడూ ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించలేదని వెంకయ్య గుర్తుచేసారు.
కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదాను నిరాకరించినందుకు స్పీకర్ సుమిత్రా మహాజాన్ ని, అడ్వకేట్ జనరల్ ని నిందిస్తున్నారని, కానీ యుపిఏ ప్రభుత్వంలో కూడా వాళ్లు పాటించిన నియమం అదే కదా అని అన్నారు వెంకయ్య నాయుడు. నెహ్రూ రాజీవ్ గాంధీల సమయంలో ఏం చేసారన్నది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే ఎలా అన్నారు వెంకయ్య.
ఇలా మీడియాలో కాంగ్రెస్ అన్నమాటలకు మీడియాలో భాజపా సమాధానం చెప్తోంది- పార్లమెంట్ లో ఒకరితో మరొకరు నేరుగా మాట్లాడుకోకుండా స్పీకర్ ని ఉద్దేశించే మాట్లాడినట్లుగా.
మహాభారతమంతా కౌరవులు, పాండవుల మధ్య జరిగిన ఉదంతమే. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అంతా కాంగ్రెస్ భాజపా లమధ్య యుద్ధమే, ప్రజలంతా నిమిత్తమాత్రులన్నట్లుగా ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more