గురజాడ అప్పారావు రచించిన "దేశమును ప్రేమించుమన్న" అన్న పాటలో "సొంత లాభము కొంత మానుకు.. పొరుగువాడికి తోడుపడవోయ్" అంటాడు. కార్పొరేట్ సంస్థలు కూడా ఎంతసేపు లాభార్జన కోసమే కాకుండా వ్యాపారం కోసం అవకాశమిస్తున్న సమాజానికి కూడా కొంత భాగాన్ని తిరిగి ఇవ్వటం అవసరమే. సామాజిక సంస్థలు- సామాజిక బాధ్యత అనే అంశం మీద ప్యాఫ్సీ భవన్ లో నిర్వహించిన సెమినార్ లో తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కె తారాక రామారావు మాట్లాడుతూ అదే విషయాన్ని సూచించారు.
అనేక మంది దేశంలో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నందున కార్పొరేట్ సంస్థలు వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చిన కెటిఆర్ పేదలు, ధనికుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా సంస్థలు పాటుపడాలని కోరారు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు చేరని ప్రాంతాలలో దృష్టి సారించాలని కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కెటిఆర్ సూచించారు.
ఈ సందర్భంలో టర్నోవర్ 1000 కోట్ల రూపాయలు దాటినా లేక ఆదాయం 5 కోట్ల రూపాయలు దాటినా అటువంటి సంస్థలు తప్పనిసరిగా 2 శాతం ఆదాయాన్ని సమాజసేవ కోసం ఉపయోగించాలన్నది చట్టం నిర్దుష్టంగా ఉన్నదన్న విషయాన్ని కెటిఆర్ గుర్తుచేసారు.
వ్యాపారం కూడా సమాజ సేవే నిజానికి. వ్యాపారమన్నదే లేకపోతే సమాజం, దేశం ముందుకు పోవటమనేది ఉండదు. ఆ వ్యాపారాన్ని కొనసాగించాలంటే వ్యాపారికి తగినంత లాభం చేకూరటం కూడా అవసరమే. అయితే లాభాలు పెరిగినప్పుడు వ్యాపారం చెయ్యటానికి అవకాశం ఇచ్చిని సమాజానికి కొంత భాగం తిరిగివ్వటమనేది కృతజ్ఞతా భావం. చిన్న వ్యాపారులు అలాంటి సేవలు చేస్తూనేవుంటారు. గుళ్ళు గోపురాలకు, శ్రీరామనవమిలాంటి పండుగలకు ఖర్చుపెడుతూనేవుంటారు. పెద్ద పెద్ద సంస్థలు మాత్రం ఎంతసేపు వ్యాపారంలోనే పడి తప్పనిసరై ఒక్క రాజకీయ పార్టీలకు తప్ప వేరెవరికీ సాయం చెయ్యనివారున్నారు.
అందువలన అటువంటి సంస్థలు- తమ లాభాన్ని పూర్తిగా ఇవ్వమనటం లేదు- సొంత లాభంలో కొంత శాతం- మీలా లక్ష్మీ ప్రసన్నం చేసుకోలేని అభాగ్యులకోసం ఖర్చు పెట్టమన్నది కెటిఆర్ చెప్పిన మాటల్లోని సందేశం.
-శ్రీజ
Serve society as well, Telangana IT Minister K Tarakarama Rao suggests Corporate business and non profiable organisations.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more