మెదక్ జిల్లాలో గురువారంనాడు కాకతీయ స్కూలు బస్సును నాందెడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే! ఇందులో దాదాపు 30 మందిదాకా విద్యార్థులు వుండగా... 20 మంది దుర్మరణం చెందారు. మిగిలిన విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారని, చికిత్స నిమిత్తం వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చికిత్స పొందుతున్న చిన్నపిల్లలను పరామర్శించారు. ఆర్థనాదాలతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులకు భరోసానిచ్చాడు.
అలాగే ఈ విషాదగాధకు విషయంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... ఇటువంటి సంఘటనలు ఇప్పటినుంచి జరుగుతున్నవి కావు. మన కేంద్రప్రభుత్వాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. ప్రభుత్వాలు ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల సరిగ్గా శ్రద్ధ చూపితే ఇలాంటి దారుణాలు చోటుచేసుకునేవి కావని ఆయన అన్నారు. కనీసం ఈ దుర్ఘటనను అయినా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తాను చికిత్స పొందుతున్న చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి పరామర్శించినప్పుడు అక్కడున్న పసివారి హృదయవిదారక యాతన చూసి తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం చాలా దారుణంగా వుందని, చావుబతుకుల మధ్య వారు కొట్టుమిట్టాడుతున్నారని... ఇంకో 12 గంటలు గడిస్తే గానీ క్షతగాత్రుల పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు పవన్ కల్యాణ్ తీవ్ర మనోవేదనతో తెలిపారు. ఇకనుంచైనా అన్ని రాజకీయ పార్టీలవారు తమతమ మనస్తత్వ భావాలను తొలగించుకుని, ప్రజల సంక్షేమానికి అవసరమయ్యే అన్ని ప్రణాళికలు, వారికి రక్షణ కలిగే దిశలో కమిటీలు ఏర్పాటు చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరుకున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more