అమర్ నాథ్ యాత్రికుల మీద ఉగ్రవాదులు పంజా విసరటానికి చూస్తున్నారని భారత నిఘా సంస్థ మంగళవారం పార్లమెంట్ కి నివేదికనిచ్చింది. స్టేట్ హోం మంత్రి కిరణ్ రిజిజు దీన్ని ధృవీకరిస్తూ అమర్ నాధ్ యాత్రికులు లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతున్నారన్న నిఘాసంస్థల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు వచ్చాయని, ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర మొదలైన దగ్గర్నుంచీ జమ్ము కాశ్మీర్ లో గండెర్బాల్ జిల్లా లో యాత్రా బస్సులు, కార్ల మీద రాళ్ళు వెయ్యటం లాంటి వార్తలు అందుతూనేవున్నాయన్నారు. యాత్రికులలో ఒకరికి గాయాలవటం, విండో పేన్స పగిలిపోవటం జరగటం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై యాత్రికులకోసం అదనపు భద్రతా ఏర్పట్లను చేసిందని అన్నారు.
అమర్ నాథ్ యాత్రకు పోయే మార్గమంతా కూడా ప్రమాదకరంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అనువుగా ఉందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లోగడ ఒకసారి ప్రకటించింది. అలాగే అమర్ నాథ్ యాత్రికుల భద్రతా ఏర్పాట్లను సరిచూసుకోమని కూడా భద్రతా దళాలకు సూచించింది.
అమర్ నాథ్ యాత్రా మార్గం కొండప్రాంతం అవటం వలన ఉగ్రవాద చర్యలకు అనుకూలంగా ఉండటమే కాకుండా, అక్కడేమైనా జరిగితే ఆ వార్త దేశమంతా సంచలనం సృష్టించేదవుతుంది కాబట్టి కూడా ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో వేటు వెయ్యవచ్చని, అందుకు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే, పోయిన వారం అన్ని ఏజెన్సీలకు సూచిస్తూ, జూన్ 28 నుంచి మొదలయ్యే అమర్ నాథ్ యాత్ర సందర్భంగా వారి వారి పద్ధతుల్లో భద్రతను కలిగించవలసిందిగా ఆర్మీ, పోలీస్ శాఖకు హెచ్చరికలు జారీచేసింది.
దానితో పాటుగా ఏరియల్ సర్వేలను చేస్తూ అవసరం అనుకున్న ప్రాంతాలలో నిఘా పెంచుతూ భద్రతా సిబ్బందిని మోహరింపజేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. హిందువులకు పవిత్రమైన అమరనాథ్ గుహ దగ్గర సందేహాత్మకంగా తిరుగాడేవాళ్ళని కనిపెట్టమని కూడా సూచించటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more