భారత సంతతికి చెందిన వ్యాపారికి ఆర్థిక నేరం కింద అమెరికన్ కోర్టు శిక్ష విధించింది.
భారత్ సంతతికి చెందిన శైలేశ్ షా (43) అమెరికాలో రెండు పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీలకు సిఇఓ. కాలిఫోర్నియాలోని చైనో లో నివసించే ఆయన తన కంపెనీ షేర్ల కొనుగోలు చెయ్యటానికి లంచం ఇవ్వజూసారన్న అభియోగం మీద ఆయన మీద ఎఫ్ బి ఐ కేసు పెట్టి దర్యాప్తు చేసింది. ఆయన అమెరికన్ జిల్లా జడ్జ్ రిచర్డ్ స్టీర్న్స్ ఎదురుగా దోషినని ఒప్పుకున్నారు.
ఎఫ్ బి ఐ ఏజెంటని తెలియక పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రతినిధి అనుకుని, ఎస్ఓహెచ్ఎం ఇంక్, కోస్టాస్ ఇంక్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ షా తన కంపెనీ వాటాలను కొనుగోలు చెయ్యటానికి అతని లంచం ఆఫర్ చేసారు. మైక్రో క్యాప్ స్టాక్స్ అనేవి స్టాక్ ట్రేడింగ్ లో తక్కువ స్థాయిలో ఒక్కోసారి షేర్ పెన్నీ కి కూడా ట్రేడింగ్ జరిగేవి. అలాంటి మైక్రో క్యాప్ స్టాక్ మార్కెట్ లో నడుస్తున్న అవినీతిని అంతమొందించటానికి వచ్చిన ఎఫ్ బి ఐ ఏజెంట్ అని తెలియని షా అతనితో బేరాలాడి లంచం ఇవ్వజూసారు. ఈ కేసులో ఆయన్ని ఫిబ్రవరి 27 న అరెస్ట్ చేసారు.
ఈ నేరం మీద కోర్టు షా కి 20 సంవత్సరాల జైలు శిక్ష, ఆ తర్వాత 3 సంవత్సరాలు పరిశీలనలో విడుదల, 250000 డాలర్ల పెనాల్టీ ని కోర్టు శిక్షగా విధించింది. ఇది అక్టోబర్ 23 నుంచి అమలు జరుగుతుందని ఎఫ్ బి ఐ తెలియజేసింది.
శైలేశ్ షా తో పాటు చైనో, కాలిఫోర్నియాలోనే నివసించే సందీప్ షా (40) కి కూడా అదే విధమైన శిక్ష అమలు అవుతుంది. సందీప్ షా క్యాప్ స్టాక్స్ ని ప్రమోట్ చేస్తూ పబ్లిక్ కంపెనీలకు నిధులను సమకూర్చటంలో తోడ్పడుతుంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more