కేంద్ర ఆర్థిక మంత్రలు బడ్జెట్ ప్రసంగాలలో చేసే ప్రకటనలలోని కొత్త ప్రాజెక్ట్ ల కేటాయింపులు కేవలం కాగితం మీద అంకెలకే పరిమితమౌతాయన్నది నిజమని తెలుసుకున్న కొత్త ఆర్థిక మంత్రి కూడా ధైర్యంగా కొన్ని ప్రాజెక్ట్ లకు నిధుల కేటాయింపులను ప్రకటించేసారని ఆర్థిక శాస్త్ర, రాజకీయ రంగ విశ్లేషకులు అంటున్నారు.
బడ్జెట్ లో కేటాయింపు, ప్రకటనల సమయం వేరు, వాటిని అమలు చెయ్యటానికి పట్టే సమయం వేరు కాబట్టి చాలా సందర్భాల్లో కేటాయించిన నిధిని ఆ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా లేక అసలే వినియోగించుకోలేని స్థితిలోనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే ముందు దాని మీద తర్జనభర్జనలు, భూసేకరణ, ఆ తర్వాత దశలవారీ అమలు జరుగుతుంది. ఈ లోపులో పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది, ఇట్టే సంవత్సరం తిరిగిపోతుంది. అప్పుడే జూలై మాసం అయిపోతోంది. ఈ మిగిలిన కాలంలో ప్రాజెక్ట్ లమీద ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, ఎంత ముందుకు తీసుకెళ్తారన్నది ఆర్థిక మంత్రులకు బాగా తెలుసు.
అందువలన చాలా సందర్భాలలో ప్రకటించిన ప్రాజెక్ట్ ల వలన ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరగటం, రాజకీయంగా లాభించటం జరుగుతుంది. సంవత్సరం తిరిగి రాగానే నిధులను కేటాయించాం కానీ వాటిని వాడుకోలేదంటూ కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా తమ గొప్పతనం ఖాతాలో జమచేసుకుంటుంది. దానితో లోటు బడ్జెట్ లో కొంత బెడద తీరిపోతుంది. ఇదే ధైర్యంతో లోటు బడ్జెట్ తయారు చెయ్యటం జరుగుతుంది. నిజంగా కేటాయించిన నిధులను వినియోగించుకున్నట్లయితే లోటు పూరించటం ప్రభుత్వానికి తల ప్రాణం తోకకి వచ్చినంత పనౌతుంది.
ఈ కిటుకు తెలుసు కనుకనే ప్రణబ్ ముఖర్జ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆ స్థానంలో చిదంబరం బడ్జెట్ ప్రకటనలు చేసినప్పుడు కానీ ఎంత మాత్రం సంశయం లేకుండా వాటిని పూర్తి చెయ్యటం ఎలా సాధ్యమౌతుందని ఆలోచించకుండా ప్రకటించటం జరిగింది. అదే బాటలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వెళ్తున్నారన్నది విశ్లేషకుల వాదన.
గత పది సంవత్సరాలలో రైల్వే బడ్జెట్ లో 99 ప్రాజెక్ట్ లను ప్రకటించటం జరిగింది కానీ అమలైంది మాత్రం ఒకటేనని రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు.
అస్సాంలో కానీ అది ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగినా ప్రాజెక్ట్ ల ప్రకటనలు వోట్లు గెలుచుకోవటానికే బాగా పనికివస్తాయన్నది దీనితో అర్థమౌతోంది.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాజెక్ట్ ల విషయంలో చర్చించి, వాటిని అమలు పరచటానికి షెడ్యూల్స్ తయారు చేసుకుని, వాటిని అక్షరాలా పాటించేట్టుగా నియంత్రణ చేస్తూ నిధులను విడుదల చెయ్యటం ద్వారా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అలాగే గనక జరిగితే కేటాయించిన నిధులు సంవత్సరాంతంలో మిగిలిపోవటం అనేది ఉండదు, అప్పుడు లోటు బడ్జెట్ ని ఎలా పూరించాలా అన్నది సమస్యగా మారుతుంది. ఇప్పుడా సమస్య ఎదురవదనే ధైర్యం ఉండబట్టే సాహసించి ప్రాజెక్ట్ లకు నిదులను కేటాయించటం జరుగుతోందన్నది విశ్లేషకుల అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అంటే ఇదేనేమో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more