(Image source from: The main elements in 2014-15 union budget)
2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారులో విడుదలైన ఈ తొలి బడ్జెట్ లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ప్రధానాంశాలు ఇవే :
* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ ను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందించాం.
* ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 50,548 కోట్లు.
* గ్రామాణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు.
* గ్రామీణ తాగునీటికి రూ. 3,600 కోట్లు.
* బాలికల సాధికారతకు రూ.100 కోట్లు.
* ఆడపిల్లలను చదివించండి, రక్షించండి పథకానికి రూ. 500 కోట్లు.
* మహిళల భద్రతకు రూ. 150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు.
* అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు.
* ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ. 500 కోట్ల కేటాయింపు.
* ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్.
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. నెలకు రూ. 1000 పెన్షన్. ఈ పథకం కోసం రూ. 250 కోట్ల కేటాయింపు.
* ఆంధ్రప్రదేశ్ కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీ.
* కొత్తగా 12 మెడికల్ కాలేజీలు (వైద్య,దంత).
* ప్రధాని గ్రామ్ సడక్ యోజనకు రూ. 14,389 కోట్లు.
* 2019 నాటికి పరిశుభ్ర భారత్.
* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ. 8000 కోట్లు.
* నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం.
* 2022 నాటికి అందరికీ నివాసం.
* దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు.
* ఏకీకృత ప్రావిడెంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్ వో ప్రారంభం.
* సర్వశిక్షా అభయాన్ కు రూ. 28,635 కోట్లు.
* మదర్సాల అభివృద్ధికి రూ. 100 కోట్లు.
* వాటర్ షెడ్ పథకానికి రూ. 2142 కోట్లు.
* మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు.
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు. జాతీయ బ్యాంకుల్లో వాటాల అమ్మకం ద్వారా మూలధనం పెంపు. అయితే, అధిక వాటాను ప్రభుత్వం కలిగి ఉంటుంది.
* గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 14,389 కోట్లు.
* నగరాల్లో మెట్రో పనులకు రూ. 100 కోట్లు.
* కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అభివృద్ధికి రూ. 100 కోట్లు.
* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ. 500 కోట్లు.
* మహిళలకు పావలా వడ్డీ పథకం 250 జిల్లాలకు పెంపు
* రైతుల కోసం కిసాన్ టెలివిజన్ కు రూ. 100 కోట్లు.
* వ్యవసాయ రంగంలో గోదాముల నిర్మాణానికి రూ. 5000 వేల కోట్లు.
* వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధికి రూ. 500 కోట్లు.
* దేశవ్యాప్తంగా 100 మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు.
* పథకాల్లో తాగునీటి పథకానికి రూ. 28635 కోట్లు.
* వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్ లో తొలుత 20 పరిశ్రమలు.
* ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి కాకినాడ పోర్టు కీలకం.
* ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం,అధిక వృద్ధి రేటును పెంచడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యం.
* రానున్న 3-4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వృద్ధి రేటును సాధిస్తాం.
* పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం.
* ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం.
* భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం.
* జీఎస్ టీ అమలుపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాలతో చర్చించి జీఎస్ టీ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
* పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేస్తాం.
* ఇన్స్యూరెన్స్ రంగంలో ఎఫ్ డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు.
* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంపు.
* పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం.
* కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం.
* పన్ను చెల్లింపుదారుల సమస్యల సరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం.
* దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం.
* దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం.
* గుజరాత్ లో నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రూ. 200 కోట్లు కేస్తాయిస్తున్నాం.
* కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం.
* 4.1 శాతానికి కరెంట్ ఖాతా లోటు కష్టమయినా తగ్గించారు. 2015-16 నాటికి 3.6 శాతానికి, 2016-17 నాటికి 2 శాతానికి తగ్గించాలనేదే మా లక్ష్యం. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు. వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more