2011 నుంచి ఇప్పటివరకు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకునిపోయి వదిలిపెట్టటం వలన దేశానికి గడించిపెట్టిన సంపాదన 40 మిలియన్ యూరోలు. ఈ విషయాన్ని అటామిక్ ఎనర్జీ, ఎర్త్ సైన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ కి మంత్రిత్వ బాధ్యతలను వహిస్తున్న జితేందర్ సింగ్ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలియజేసారు.
భారత దేశ స్పేస్ ప్రాజెక్ట్ సాంకేతికంగా స్వయం సమృద్ధిని సాధించటంతో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించగలుగుతోంది. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ మన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టటమే కాకుండా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా స్పేస్ లోకి తీసుకునిపోవటంతో అంతకు ముందు వెచ్చించిన ఖర్చుకి బదులుగా ఇప్పుడు విదేశాలనుంచి ఆదాయాన్ని సంపాదిస్తోంది. కేంద్ర మంత్రి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం ఇస్రో సంపాదన 39.82 మిలియన్ యూరోలు. 2020 వలకు స్పేస్ ప్రోగ్రాంలు సిద్ధంగా ఉన్నాయని కూడా మంత్రి తెలియజేసారు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన మార్స్ ఆర్బిటర్ మొత్తం ఖర్చు అంచనా రూ. 450 కోట్లైతే, ఇప్పటికే రూ. 349.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కూడా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలియజేసారు.
దేశంలో ఇంత దారిద్ర్యం, ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఇంత ఖర్చు పెట్టటం అవసరమా అంటే, దేశం అన్ని రంగాలలోను పురోగమించటం ఆశించదగ్గదే. అందులోను స్పేస్ ప్రాజెక్ట్ ఖర్చుతో పాటుగా ఆదాయ వనరులను కూడా పెంచుతున్న సందర్భంలో అది వాంఛనీయమే. ఎందుకంటే ఈ స్పేస్ ప్రాజెక్ట్ ల వలన భారత దేశం సాంకేతికంగా ఎంతో ముందుకు పోబోతున్నది. సమాచార వ్యవస్థ ఇంకా పటిష్టం కాబోతున్నది. భూపరిశీలనలో నియమించే ఉపగ్రహాల వలన ఎంతో ముఖ్యమైన సమాచారం అందబోతున్నది. అందులో నావిగేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగకరమైనది. దీని సాయంతో అపాయాలలో చిక్కుకుపోయిన వాహనాలను గుర్తించి వెతికిపట్టుకోవటం లాంటి ట్రాకింగ్ కి ఉపయోగపడుతుంది.
ఆదాయం లేకపోయినా చెయ్యవలసిన సాంకేతిక పురోగతి ఇది. అలాంటప్పుడు ఉపగ్రహాల లాంచింగ్ కోసం విదేశీయులకు చెల్లించే పైకం ఆదా చేసుకోవటమే కాకుండా విదేశాల నుంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్న సమయంలో స్పేస్ రిసెర్చ్, శాటిలైట్ లాంచింగ్ లాంటి పనులు దేశానికి పేరు తెచ్చిపెట్టి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టటమే కాకుండా దేశంలోని సాంకేతికాభివృద్ధికి కూడా బాటలు వేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ లు దేశానికి అవసరమైనవేనని పలువురు భావిస్తున్నారు.
ఇక ఖర్చు విషయానికి వస్తే, కొన్ని ఖర్చులు జీవితంలో తప్పనిసరైనవే. పెళ్ళి చేసుకోవటం ఖర్చుతో కూడుకున్నదే, ఆ తర్వాత సంసారం, పిల్లలు, వాళ్ళకి చదువు సంధ్యలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా ఖర్చుని పెంచేవే కానీ జీవితంలో అత్యంత అవసరమైనవే. అలాగే ప్రపంచస్థాయిలో భారత దేశాన్ని సాంకేతికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టటానికి చేసే ఈ ఖర్చు కూడా డిఫెంస్ ఖర్చు లాంటిదే. రోజూ యుద్దం జరగదు కానీ యుద్ధానికి సన్నద్ధులమై ఉండటం కోసం ఖర్చు పెట్టక తప్పదు. అదేవిధంగా పరిశోధనలు కూడా ఖర్చుతో కూడుకున్నవే అయినా అవి దేశపురోగతి దృష్ట్యా అవసరమైనవేనన్న అభిప్రాయంలో ఉన్నారు ఆర్థిక శాస్త్ర విశ్లేషకులు కూడా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more